Begin typing your search above and press return to search.

డిమాండ్ క్యాష్ చేసుకుంటున్న బ్యూటీ..!

కెరీర్ దాదాపు అయిపోయింది అనుకున్న వారందరికీ ఆమె మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటింది. ఇక పి.ఎస్ 1, 2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 1:30 AM GMT
డిమాండ్ క్యాష్ చేసుకుంటున్న బ్యూటీ..!
X

రెండు దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న చెన్నై చిన్నది త్రిషా కృష్ణన్ మధ్యలో కొంత ఫాం కోల్పోయినట్టు కనిపించినా 96 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చింది. కెరీర్ దాదాపు అయిపోయింది అనుకున్న వారందరికీ ఆమె మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటింది. ఇక పి.ఎస్ 1, 2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక రీసెంట్ గా వచ్చిన దళపతి విజయ్ లియో సినిమాలో కూడా త్రిష తన లుక్స్ తో ఆకట్టుకుంది.

పాత్ర పరంగా నిడివి తక్కువగానే ఉన్నా సరే త్రిష కనిపించినంత సేపు అట్రాక్టివ్ గా అనిపించింది. వయసు పెరుగుతున్నా కొద్దీ అమ్మడిలో అందం రెట్టింపు అవుతుంది అన్నట్టుగా త్రిష గ్లామర్ రోజు రోజుకి పెరుగుతుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా నేటి తరం యువ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మడి లుక్స్ ఉన్నాయి. లియో హిట్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన త్రిష వరుస అవకాశాలతో అదరగొట్టేస్తుంది.

కోలీవుడ్ లో ప్రస్తుతం కమల్ 234 సినిమాలో ఛాన్స్ అందుకున్న అమ్మడు అజిత్ కుమార్ హీరోగా వస్తున్న విడా ముయార్చి లో కూడా నటిస్తుంది. కెరీర్ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న టైం లో డిమాండ్ ని బట్టి క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. అందుకే నిన్న మొన్నటిదాకా 2, 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న త్రిష రాబోయే సినిమాలకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుందట.

తనని హీరోయిన్ గా తీసుకోవాలనుకునే వారికి రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తుంది అమ్మడు. తెలుగులో కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా ఇలా రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్లే ఆ అవకాశాలు చేజారాయని తెలుస్తుంది. అయితే త్రిష ప్రస్తుత లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మరి అలాంటి అందాల భామని తీసుకోవాలంటే ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే.

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష డిస్కషన్స్ లో ఉందని వార్తలు వచ్చాయి. మెగా 156 లో త్రిష కాదు అనుష్క ఫైనల్ అయ్యిందని తెలిసిందే. అయితే బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మాత్రం త్రిష ని సెలెక్ట్ చేసినట్టు టాక్. ఆ విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.