రెమ్యునరేషన్ మ్యాటర్.. బాలయ్య కూడా అలానే..
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 5:55 AMటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న ఆయన.. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తన యాక్టింగ్ తో సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పించారు. బాలయ్య బాబుగా అందరి మనుసుల్లో నిలిచిపోయారు.
ఆరు పదుల వయసులో అటు రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. ఇటు వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అఖండ-2లో నటిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. బాలయ్య రూటే సెపరేట్ అని అంతా చెబుతుంటారు. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా తక్కువ పారితోషకం తీసుకుంటున్నారని అంటుంటారు. టాలీవుడ్ కు చెందిన అనేక మంది టాప్ హీరోల కన్నా ఆయన రెమ్యునరేషన్ తక్కువే అనే ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలకు గాను ఆయన రూ.15-18 కోట్లు మాత్రమే అందుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య మారిపోయారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వరుస విజయాలతో ఆయన తన పారితోషికాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు సమాచారం.
రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ మూవీకి పెద్ద మొత్తంలో అందుకున్నారని, మునుపటి కన్నా బాగా పెంచారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ అఖండ-2కు ఆయన.. రూ.35 కోట్లు అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో నిజమెంతో తెలియదు కానీ ఆ విషయం వైరల్ గా మారింది.
గోపీచంద్ మలినేనితో చేయనున్న సినిమాకు రూ.45 కోట్లు పారితోషికం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య రెమ్యునరేషన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది ఆయన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. పెంచడంలో తప్పు లేదని అంటున్నారు.