సీక్వెల్స్ నచ్చవ్ కానీ బాలయ్య కోసం బరిలోకి!
బాలకృష్ణ హీరోగా నటించిన `ఆదిత్య 369` అప్పట్లో ఎంత గొప్ప చిత్రంగా నిలిచిందో తెలిసిందే.
By: Tupaki Desk | 22 April 2025 6:22 AMబాలకృష్ణ హీరోగా నటించిన `ఆదిత్య 369` అప్పట్లో ఎంత గొప్ప చిత్రంగా నిలిచిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సింగీతం శ్రీనివాస్ రావు టేకింగ్...బాలయ్య నటన..రాజీ లేని నిర్మాణంతో ఎంతో గొప్ప చిత్రంగా నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో కాదు యావత్ భారత్ చిత్ర పరిశ్రమలోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమాకు స్వయంగా స్టోరీ రాసారు. మరి ఆయనే డైరెక్ట్ చేస్తారా? నటిస్తారా? లేక కుమారుడిని సోలోగా దించుతారా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ బాలయ్య మాత్రంఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు మరో గొప్ప సాంకేతికల విలువల గల సినిమా అందించాలని తపిస్తున్నారు.
మరి ఈ సినిమా నిర్మాణంలో శివలెంక భాగమవుతున్నారా? లేదా? అన్న దానిపై ఇంత వరకూ సరైన క్లారిటీ లేదు. సాధారణంగా ఈ సినిమా రైట్స్ మొత్తం ఆయనవే. బాలయ్య తీయాలనుకున్నా? రైట్స్ ఆయన నుంచి కొనుక్కున్న తర్వాతే పట్టా లెక్కించాలి. అంత వరకూ అది సాధ్యపడదు. అయితే బాలయ్య ఆసక్తి చూసి శివలెంక ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీక్వెల్స్ చిత్రాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు.
సీక్వెల్స్ తీయడం అంటే తనకు ఎంత మాత్రం ఇష్టం ఉండదన్నారు. తీసిన కథకు కంటున్యూటీ అంటే తాను బోర్ గా ఫీలవుతానని అందుకే వాటి జోలికి వెళ్లనన్నారు. కానీ బాలయ్య ఆసక్తి చూసి తాను కూడా భాగం అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శివలెంక కృష్ణ ప్రసాద్ వరుస నిర్మాణలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆయన సంస్థ నుంచి `సారంగపాణి జాతకం` రిలీజ్ అవుతుంది.