నెలన్నర గదిలోనే యువనటుడు బందీ
ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ టాలీవుడ్ సినిమా సైనికుడు(మహేష్ హీరో)లో నటించాడు.
By: Tupaki Desk | 7 May 2025 6:22 PMప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ టాలీవుడ్ సినిమా సైనికుడు(మహేష్ హీరో)లో నటించాడు. హిందీలో అగ్ర నటుడిగా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే అతడు మెదడు సంబంధ క్యాన్సర్ తో 2018లో మృతి చెందాడు. ఇర్ఫాన్ మరణించిన తర్వాత అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారసుడు బాబిల్ ఖాన్ ముందుకు వచ్చాడు. బాబిల్ చాలా చిన్న వయసులో తన తండ్రిని కోల్పోయిన బాధను అనుభవించాడు. తన తండ్రి ఇక లేడు అనే నిజాన్ని కూడా అతడు జీర్ణించుకోలేకపోయానని అన్నాడు. నిదుర లేచి తన తండ్రితో ఏదో చెప్పాలని అనుకునేవాడు. కానీ అతడు లేడు అని తెలుసుకుని బాధపడేవాడు. కానీ చివరకు అలవాటు పడ్డాడు.
తన తండ్రి ఇర్ఫాన్ ఖాన్ మరణించిన తర్వాత నెలల తరబడి తనను తాను గదిలోనే బంధించుకున్నానని తెలిపాడు. తన తండ్రి ఇర్ఫాన్ మరణించిన రోజు, దానిని నమ్మలేదని చెప్పాడు. దుఃఖాన్ని తట్టుకునేంత పరిణతి తనకు ఉందని భావించినా, అప్పటికి ఇంకా చిన్నపిల్లవాడినని గ్రహించాడు. నేను నెలన్నర పాటు గదిలోనే ఉండిపోయాను. నాన్న నెలల పాటు షూటింగులోనే ఉండిపోయేవాడు.. చాలా ఎదురు చూసేవాడిని. కానీ ఇది నిరవధిక షూటింగ్ షెడ్యూల్ అని నేను నెమ్మదిగా గ్రహించాను అని తెలిపాడు. ప్రాణ స్నేహితుడి లాంటి తన బాబా (తండ్రి) లేడు అనే దుఃఖాన్ని తట్టుకోలేకపోయానని బాబిల్ అన్నాడు.
2018లో ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలిసింది. ఏప్రిల్ 2020లో అతడు తుది శ్వాస విడిచాడు. ఆ తర్వాత బాబిల్ ఖాన్ తండ్రి లెగసీని ముందుకు నడిపిస్తున్నాడు. బాబిల్ నెట్ఫ్లిక్స్లో త్రిప్తి దిమ్రీతో కలిసి `ఖాలా`తో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. ఈ సైకలాజికల్ డ్రామా చిత్రం ప్రేక్షకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. అలాగే రైల్వే మెన్లోను అతడి నటనకు గుర్తింపు దక్కింది. మాధవన్ , కేకే మీనన్ లాంటి సీనియర్లతో కలిసి నటించాడు. ఫ్రైడే నైట్ ప్లాన్ లోను అతడి నటనకు పేరొచ్చింది.