Begin typing your search above and press return to search.

అమర్ దీప్ కారుపై రైతు బిడ్డ ఫ్యాన్స్ ఎటాక్..!

అయితే ఫైనల్ ఎపిసోడ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు ఎటాక్ చేశారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:55 AM GMT
అమర్ దీప్ కారుపై రైతు బిడ్డ ఫ్యాన్స్ ఎటాక్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 షో ముగిసింది. ఈసారి టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కామన్ మ్యాన్ కేటగిరిలో హౌస్ లోకి వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో తమ బెస్ట్ ఇస్తూ వచ్చాడు. అయితే పల్లవి ప్రశాంత్ ని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చాడు అమర్ దీప్. ఓ విధంగా పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యింది అక్కడే. అనవసరంగా అతన్ని టార్గెట్ చేసి అతని మైలేజ్ పెంచారు. సో అది అతన్ని టైటిల్ విన్నర్ అయ్యేలా చేసింది.

అయితే ఆట ముగిసింది. షో విన్నర్ తేలిపోయింది. వారంతా హౌస్ లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నారు. అయితే ఫైనల్ ఎపిసోడ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు ఎటాక్ చేశారు. హౌస్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చెసిన అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోపాన్ని పెంచుకున్నారు. అందుకే అతని కారు అద్దాలు ధ్వంసం చేశారు.

కారులో లేడీస్ ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా ప్రశాంత్ ఫ్యాన్స్ కారుని ఎటాక్ చేసి అద్దాలు పగలకొట్టారు. ఈ విషయంపై అందరు సీరియస్ గా ఉన్నారు. హౌస్ లో అక్కడ పరిస్థితులను బట్టి ఆట తీరు, ప్రత్యర్ధులు ఏర్పడుతారు తప్ప వారి మధ్య పర్సనల్ గా ఏమి ఉండదు. కానీ ఆడియన్స్ మాత్రం షో ముగిసిన తర్వాత కూడా అది కొనసాగిస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారుని ధ్వంసం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అయితే దీనిపై అమర్ దీప్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ ఏదైనా మాట్లాడుతారా అన్నది చూడాలి. మరోపక్క బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని కారు బ్యాక్ సైడ్ అద్దాలు కూడా ఎవరో పగలకొట్టారు. దానిపై ఆమె ఫైర్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతు రాయల్ కారుని కూడా ధ్వంసం చేశారని తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇళ్లకు సురక్షితంగా చేరేలా చేయడంలో బిగ్ బాస్ టీం విఫలమైందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా రన్నర్ గా అమర్ దీప్ నిలిచాడు.