Begin typing your search above and press return to search.

మరో మెగాహీరో సినిమాలో యంగ్ సెన్సేషన్..??

By:  Tupaki Desk   |   26 May 2021 9:30 AM GMT
మరో మెగాహీరో సినిమాలో యంగ్ సెన్సేషన్..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్.. అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీలో హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది సాయిధరమ్ తేజ్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ మెగాహీరో మారుతీ దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' హిట్ అందుకున్న తర్వాత తదుపరి సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గతేడాది సుబ్బు అనే దర్శకుడితో 'సోలో బతుకే సో బెటర్' అనే సినిమా చేసాడు. లాక్డౌన్‌ అనంతరం రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా అదే. మొత్తానికి సినిమా విడుదలై మంచి అందుకుంది. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా సాయిధరమ్ తేజ్ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నాడు.

సోలో హిట్ నుండి సాయితేజ్ స్పీడ్ పెంచేసాడు. ఇప్పటికే రిపబ్లిక్ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి వెయిట్ చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దేవాకట్టాతో సినిమా అనేసరికి ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఓ రచయితగా, దర్శకుడుగా దేవా తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆలోచనాత్మకంగా తెరకెక్కించడంలో దేవాకట్టా చాలా సిద్ధహస్తుడు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదాపడినట్లు టాక్..ఇదిలా ఉండగా.. మెగాహీరో తదుపరి సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నాడు.

ఇప్పటికే సినిమా ఓకే అయిపోయి షూటింగ్ కూడా ప్రారంభమైంది. మిస్టికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే డైరెక్టర్ కార్తీక్ దర్శకుడుగా ఇదివరకు భంభోలేనాథ్ అనే సినిమా చేసాడు. తన రెండో ప్రయత్నంగా గురువు సుకుమార్ నిర్మాణంలో సినిమా అనేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సుకుమార్ శిష్యులు అందరూ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇటీవలే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడుగా డెబ్యూ చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మరో శిష్యుడు కార్తీక్ తో సుక్కు సినిమా చేస్తున్నాడటంతో ఫ్యాన్స్ లో ఆసక్తిపెరిగింది. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ పోస్టర్ తో ఆకట్టుకున్న థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ ఎవరినేది టాపిక్ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం మెగాహీరో సరసన హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి పేరు బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే సంప్రదించగా ఆమె నుండి సానుకూలంగా స్పందన వచ్చిందట. మరి చూడాలి మరి తమ్ముడి హీరోయిన్ హీరోతో జతకడుతుందేమో!