Begin typing your search above and press return to search.

మహమ్మారి సోకి టాలీవుడ్ యువ హీరో తండ్రి మృతి...!

By:  Tupaki Desk   |   9 July 2020 7:43 AM GMT
మహమ్మారి సోకి టాలీవుడ్ యువ హీరో తండ్రి మృతి...!
X
కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు కరోనా బారిన పడగా ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మహమ్మారి సోకి మరణించాడు. ఇప్పుడు మరో సెలబ్రెటీ కరోనా కారణంగా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఈ రోజుల్లో' 'లవ్ సైకిల్' 'త్రివిక్రమన్' 'సాహసం చేయరా డింభకా' 'గలాటా' 'అరవింద్ 2' 'రయ్ రయ్' సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన యువ హీరో శ్రీ తండ్రి కరోనా కాటుకు బలయ్యారు.

శ్రీ తండ్రి దుర్గా రామ్ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారట. కుటుంబ సభ్యులు జ్వరం అని భావించినప్పటికీ కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం పాజిటివ్ అని తేలడంతో షాక్ కి గురయ్యారట. దీంతో కరోనా చికిత్స అందిస్తున్నా దుర్గా రామ్ ప్రసాద్ ఆరోగ్యం సహకరీంచలేదట. ఈ క్రమంలో నిన్న రాత్రి 8.30 గంటలకు శ్రీ తండ్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. తండ్రి మరణించడంతో యువ హీరో శ్రీ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఇక శ్రీ కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని.. వారికి నెగిటివ్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారని సన్నిహితులు వెల్లడించారు.