Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం యంగ్ హీరో షాకింగ్ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   13 July 2022 1:30 AM GMT
ప‌వ‌న్ కోసం యంగ్ హీరో షాకింగ్ నిర్ణ‌యం!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య రీమేక్ సినిమాల‌పై ప్ర‌త్యేక దృస్టి పెట్టారు. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ సినిమాల‌తో జోరు పెంచేసిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్‌' ఆధారంగా తెర‌కెక్కిన 'వ‌కీల్ సాబ్‌' తో మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇదే ఊపులో ఈ మూవీ త‌రువాత ప‌వ‌న్ మ‌రో రీమేక్ ని ప‌ట్టాలెక్కించారు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' ఆధారంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన సినిమా 'భీమ్లానాయ‌క్‌'. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రానా కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్ లుగా న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర‌వాలేద‌నిపించింది. ప్ర‌స్తుతం క్రిష్ తెర‌కెక్కిస్తున్న పీరియాడిక‌ల్ డ్రామా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే మ‌రో రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని త‌మిళంలో న‌టించిన తెర‌కెక్కించిన చిత్రం 'వినోదాయ సితం'.

ఓ సామాన్య యువ‌కుడికి, దేవ దూత‌కు మ‌ధ్య సాగే క‌థ‌గా తెర‌కెక్కిన ఈ మూవీని తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కీలక పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే సైలెంట్ గా ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు.

ఈ మూవీ కోసం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ బ‌ల్క్ డేట్స్ కేటాయించాడ‌ట‌. దాదాపు మూడు నెల‌ల పాటు ఈ మూవీ షూటింగ్ లో అందుబాటులో వుండ‌నున్నార‌ట‌. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేయ‌డంతో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈ మూవీ కోసం బ‌ల్క్ డేట్స్ కేటాయించిన‌ట్టుగా తెలుస్తోంది. ఫాంట‌సీ క‌థ‌గా రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.