Begin typing your search above and press return to search.

ఏ మాయ చేశావే' సీక్వల్ కి డైరెక్టర్ రెడీ..అక్కినేని శిబిరాల్లో ఆనందం!!

By:  Tupaki Desk   |   29 Feb 2020 8:45 AM GMT
ఏ మాయ చేశావే సీక్వల్ కి డైరెక్టర్ రెడీ..అక్కినేని శిబిరాల్లో ఆనందం!!
X
డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరెక్కించిన తమిళ సినిమా 'విన్నైతాండి వరువాయా' తెలుగులో 'ఏ మాయ చేశావే' పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వర్షన్ లో శింబు- త్రిష జంటగా నటించగా, తెలుగు వర్షన్ లో నాగచైతన్య- సమంత జోడీ కట్టారు. చిత్రంలో కార్తిక్- జెస్సీలుగా ఈ రెండు జోడీలు యువ హృదయాలను పులకరింపజేశాయి. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

అయితే మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన.. తన వద్ద 'విన్నైతాండి వరువాయా 2' స్క్రిప్ట్ రెడీగా ఉందని - ఈ కథకు శింబు ఓకే అనాలే గానీ వెంటనే సెట్స్ పైకి తీసుకొస్తానని అన్నారు. ఈ సినిమాలో శింబు సరసన అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట గౌతమ్ మీనన్.

దీంతో తమిళంలో 'విన్నైతాండి వరువాయా 2' సినిమా సెట్స్ మీదకు వస్తే, తెలుగులో 'ఏ మాయ చేశావే 2' కూడా రూపొందనుందని అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. పెళ్లి తర్వాత మరోసారి వెండితెరపై చైసామ్ జోడీ రొమాన్స్ చూసేయొచ్చని సంబర పడుతున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే అతిత్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. చూడాలి మరి 'ఏ మాయ చేశావే 2' ఎప్పుడు సెట్స్ మీదకు రానుందనేది!.