Begin typing your search above and press return to search.

OTT వ‌ర‌ల్డ్ లో య‌శ్ రాజ్ బ్యాన‌ర్ భారీ సిరీస్

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:48 AM GMT
OTT వ‌ర‌ల్డ్ లో య‌శ్ రాజ్ బ్యాన‌ర్ భారీ సిరీస్
X
ఓటీటీ (ఓవ‌ర్ ద టాప్ కంటెంట్) టెక్నాల‌జీని వ‌ర‌ల్డ్ ని ఎలా ఏల్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రోనా రాక‌తో ఓవ‌ర్ ద టాప్ కంటెంట్ అంటే ఏంటో ఓ క్లారిటీ వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కూ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి మాత్ర‌మే ప‌ర‌మిత‌మైన ఓటీటీ గురించి ఇప్పుడు ప్ర‌తీచోటా సుప‌రిచిత‌మే.

సినిమాలు.. వెబ్ సిరీస్ లు..స్పెష‌ల్ ప్రోగ్రామ్స్ ఇలా ఆడియ‌న్ ఆలోచ‌న‌ని మించిన కంటెంట్ ఇప్పుడు ఓటీటీ అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందుకే మెగా నిర్మాత అల్లు అర‌వింద్ ముందే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి `ఆహా` అనే ఓటీటీని ప్రారంభించి స‌క్సెస్ అయ్యారు. దానికి అనుబంధంగా `ఆహా 2.0` ని కూడా లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం అర‌వింద్ త‌న ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ఇండియాలో ఫేమ‌స్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. భవిష్య‌త్ లో అన్ని భాష‌ల్లో బిగ్ స్కేల్ లో లాంచ్ చేయాల‌ని చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ కూడా ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడుతుంది.

య‌శ్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా 500 కోట్ల పెట్టుబ‌డితో ఈ ఓటీటీ సంస్థ‌ని లాంచ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అందులో కంటెంట్ కూడా అంతే యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తొలి వెబ్ సిరీస్ కే 100 కోట్లు (1 బిలియ‌న్) ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌ముఖ మీడియాలు పేర్కొన్నాయి. మొద‌టి ప్రాజెక్ట్ నే ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని సంక‌ల్పించి ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు చేస్తున్న్న‌ట్లు తెలుస్తోంది.

ఓ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ స్క్రిప్ట్ ని ఇప్ప‌టికే చిత్ర‌బృందం లాక్ చేసారు. `మర్ధానీ-2` డైరెక్ట‌ర్ గోపీ పుత్ర‌న్ ఈ వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భోపాల్ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. ఇందులో న‌లుగురు బాలీవుడ్ హీరోలు న‌టించ‌నున్నారు. ఒక‌రు బాలీవుడ్ బిగ్ స్టార్ అని స‌మాచారం. ఆదిత్య చోప్రా భార్య.. న‌టి రాణీ ముఖ‌ర్జీ కూడా ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంద‌ని టాక్. వీలైనంత త్వ‌ర‌లోనే ఓటీటీ.. ప్రాజెక్ట్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం.