Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు లేకపోతే మేము లేము: వైష్ణవ్ తేజ్

By:  Tupaki Desk   |   7 Feb 2021 3:40 AM GMT
ఆ ముగ్గురు లేకపోతే మేము లేము: వైష్ణవ్ తేజ్
X
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. మొదటి మేన‌ల్లుడు సాయి తేజ్ కి మెగా హీరోల అండ ప్ర‌మోష‌న్ గురించి విధిత‌మే. ఇప్పుడు రెండో మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కి అంతే అండ‌గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా నిన్న సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వైష్ణ‌వ్ తేజ్ ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు.

నా ముగ్గురు మామయ్య‌(చిరు-నాగ‌బాబు-ప‌వన్)‌లు లేక‌పోతే మేము లేము. మాకు మద్దతుగా ఉన్నందుకు మా మేనమామలకు రుణపడి ఉన్నాము అని వ్యాఖ్యానించారు. ``నా తల్లి గురించి మాట్లాడాలి. మీ త్యాగాలకు లేక‌పోతే మేము ఇక్కడ ఉండము`` అని ఉద్వేగానికి లోన‌య్యారు. నా వెనుక నిలిచిన మెగా కుటుంబానికి ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

ఉప్పెన గురించి మాట్లాడుతూ ఈ కథే నిజ‌మైన హీరో అని వైష్ణ‌వ్ తేజ్ అన్నారు. ప్ర‌యోగంలో అవ‌కాశం ఇచ్చినందుకు మైత్రి మూవీ మేకర్స్ కు కృతజ్ఞతలు. సుకుమార్ గారిను కలిసినప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ ఆయ‌న‌ నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. విజయ్ సేతుపతి గారుతో స్క్రీన్ పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది.. అని అన్నారు. దేవీశ్రీ‌-శ్రీ‌మ‌ణి-చంద్ర‌బోస్ ఇంత‌మంది వ‌ల్ల పాట‌లు అద్భుతంగా కుదిరాయి అని అన్నారు. ఉప్పెన చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.