Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు లెక్క త‌ప్పుతోందా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 5:36 AM GMT
స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు లెక్క త‌ప్పుతోందా?
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వున్న అత్యంత బిజీ, అండ్ ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ వున్న ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని సెట్ చేస్తూ స్టార్స్ తో సినిమాలు తీస్తుంటారాయ‌న‌. ప్ర‌స్తుతం ఆయ‌న స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని నిర్మిస్తున్నారు. ప్ర‌తీ విష‌యంలోనూ ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లే ప్రొడ్య‌కూస‌ర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు లెక్క ప్ర‌స్తుతం త‌ప్పుతున్న‌ట్టుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్రస్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల క‌ల‌యిక‌లో RC15 ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీతో పాటు త‌మిళ హీరో విజ‌య్ తో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో 'వార‌సుడు' మూవీని వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్ ల‌లో రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల క‌ల‌యిక‌లో నిర్మిస్తున్న RC15 షూటింగ్ నిలిచిపోయింది. శంక‌ర్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేకిచ్చారు. గ‌త కొన్ని నెల‌లుగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ కు శంక‌ర్ కు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం కార‌ణంగా 'ఇండియ‌న్ 2' షూటింగ్ నిలిచిపోయిన విష‌యం తెలిసందే.

ఇటీవ‌లే మ‌ళ్లీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. క‌మ‌ల్ హాస‌న్ రీసెంట్ గా 'విక్రమ్‌' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని ద‌క్కించుకోవ‌డం, నిర్మాణ భాగ‌స్వామిగా యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ని రంగంలోకి దింప‌డంతో ఆగిపోయిన 'ఇండియ‌న్ 2' మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. అయితే ఈ సినిమా కార‌ణంగా RC15 షూటింగ్ నిలిచిపోవ‌డంతో దిల్ రాజు లెక్క‌లు మారిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి ముందు శంక‌ర్ తో దిల్ క‌రాజు 'ఇండియ‌న్ 2'ని చేయాల‌నుకున్నారు. అయితే బ‌గ్జెట్ లెక్క‌ల కార‌ణంగా త‌న వ‌ల్ల కాద‌ని ప‌క్క‌కు త‌ప్పుకున్నారు.

దాంతో ఆ ప్రాజెక్ట్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి వెళ్ల‌డం .. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా ఆగిపోవ‌డం తెలిసిందే. లైకా కార‌ణంగా 'ఇండియ‌న్ 2' ఆగిపోవ‌డంతో దిల్ రాజుని సంప్ర‌దించిన శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించిన‌ బ‌డ్జెట్ లెక్క‌ల‌ని ముందుగా ఓ ప్లాన్ ప్ర‌కారం అనుకున్నాకే షూటింగ్ కి దిగార‌ట దిల్ రాజు. షాకింగ్ విష‌యం ఏంటంటే సినిమా 50 శాతం పూర్త‌య్యే స‌రికే దిల్ రాజు కోట్ చేసిన బ‌డ్జెట్ అయిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క దిల్ రాజు ఇప్పుడు త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌.

అంతే కాకుండా శంక‌ర్ తెలుగు టీమ్ ని త‌ప్పించి త‌మిళ టీమ్ ని పెట్టుకోవ‌డం, టెక్నీషియ‌న్ ల‌ని మార్చేయ‌డం వంటివి చేయ‌డంతో దిల్ రాజుకు శంక‌ర్ కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌ని తెలుస్తోంది. 50 శాతం షూటింగ్ కే ఇలా వుంటే రేపు సినిమా ఎలా పూర్తి చేస్తార‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

'ఇండియ‌న్ 2' తో పాటు RC15 ని కూడా స‌మాంత‌రంగా పూర్తి చేస్తాన‌ని చెప్పిన శంక‌ర్.. చ‌ర‌ణ్ సినిమాని ప‌క్క‌న పెట్టేసి 'ఇండియ‌న్ 2' ప‌నుల‌కే ప్ర‌ధాన్య‌త నివ్వ‌డం ఇప్ప‌డు దిల్ రాజు కు మ‌రింత త‌ల‌నొప్పుల్ని తెచ్చిపెడుతోంద‌ని చెబుతున్నారు. ఇలా అయితే 2023 లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మే అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.