Begin typing your search above and press return to search.

కాస్త ఆగితే మోడీ అమెరికా అధ్య‌క్షుడిని లాగేస్తారేమో!

By:  Tupaki Desk   |   26 Jun 2021 12:30 AM GMT
కాస్త ఆగితే మోడీ అమెరికా అధ్య‌క్షుడిని లాగేస్తారేమో!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ ప‌రాకాష్ట‌కు చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజా మీడియా స‌మావేశంలో ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ .. `మా`లో చీలిక తెస్తోందంటూ మీడియాపై విరుచుకుప‌డ్డారు. మా ఎన్నిక‌లు సున్నితమైన అంశం. మేమంతా ఒకే కుటుంబం.. ఎవ‌రికి న‌చ్చిన వారికి వారు ఓటు వేయొచ్చు.

ఇక తాను మీడియా ముందుకు రాక‌పోతే ఎన్నో క‌థ‌నాలు అల్లేస్తార‌నే బ‌రిలోకి వ‌చ్చిన‌ట్టు కూడా ప్ర‌కాష్ రాజ్ తెలిపారు. వేర్వేరు ప్యానెళ్ల‌కు సినీకుటుంబాలు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నాయ‌ని చీలిక తేవడం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. టాలీవుడ్ ఆర్టిస్టుల్లో గ్రూపు రాజ‌కీయాలేవీ లేవ‌ని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసారు ప్ర‌కాష్ రాజ్.

ఇందులోకి చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఎందుకు లాగుతారు. కేసీఆర్- కేటీఆర్ ని కూడా లాగారు. కాస్త ఆగితే మోడీ అమెరికా అధ్య‌క్షుడిని లాగేస్తారేమో! అంటూ మీడియాకి త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు. మీడియా ఊహాగానాల్ని ప్ర‌చారం చేస్తోందని విమ‌ర్శించారు.

ప్ర‌కాష్ రాజ్ వెంట ఉండి కేటీఆర్ క‌థంతా న‌డిపిస్తున్నార‌ని `మా` రాజ‌కీయాల్లో కేసీఆర్ - కేటీఆర్- చిరంజీవి - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ని ప్ర‌చారం సాగ‌డంతో విల‌క్ష‌ణ న‌టుడు ఓ రేంజులోనే క్లాస్ తీస్కున్నారు. అస‌లు మా ఎన్నిక‌ల్లో ఎవ‌రి వేలు పెట్ట‌ర‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆయ‌న ఇంత క్లాస్ తీస్కుని చివ‌రిలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు మైక్ ఇవ్వ‌డంతో.. ఇదంతా ఎవ‌రి స‌పోర్టుతోనే ఊహించ‌లేమా? అంటూ జ‌నం గుస‌గుస‌లాడుకోవ‌డం క‌నిపించింది.