Begin typing your search above and press return to search.

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ని OTT కి అంకిత‌మిస్తారా?

By:  Tupaki Desk   |   13 Jan 2021 3:59 AM GMT
మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ని OTT కి అంకిత‌మిస్తారా?
X
మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` షూటింగ్ కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంద‌ని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భారీ తారాగ‌ణం పాల్గొంటున్నారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వ‌ర‌కూ ఈ చిత్రీక‌ర‌ణ స్వింగ్ తో సాగ‌నుంద‌ని తెలిసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నుండి మ‌ణి స‌ర్ భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్నార‌ని తెలుస్తోంది. స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని స‌ద‌రు సంస్థ‌ ఆశ చూపింద‌ని తెలిసింది. మణిరత్నం ఈ డీల్ కి ఓ కే చెప్పారా లేదా? OTT విడుదలకు సిద్ద‌మేనా? అన్న‌ది క్లారిటీగా తెలియాల్సి ఉంది.

పొన్నీయిన్ సెల్వన్ అదే టైటిల్ తో వెట‌ర‌న్ ర‌చ‌యిత‌ కల్కి రాసిన తమిళ ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కుతోంది. భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లోని అత్యుత్తమ నటీన‌టులు సాంకేతికతలు ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 2019లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా ప్రారంభమైంది. ఇప్ప‌టికే ప్రధాన షూటింగ్ థాయిలాండ్ ‌లో పూర్త‌యింది. అయితే కరోనావైరస్ మహమ్మారి వ‌ల్ల ఈ మూవీ కూడా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు తొమ్మిది నెలల అనంత‌రం హైదరాబాద్ రామోజీ రావు ఫిల్మ్ సిటీలో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది.

అత్యంత భారీగా నిర్మించిన‌ పీరియడ్ సెట్స్ ‌లో ఒక పాటను తెర‌కెక్కిస్తున్నారు. కార్తీ - జయం రవి- త్రిష ఈ షూట్ లో పాల్గొంటున్నారు. మ‌రో రెండు వారాల పాటు ఈ చిత్రీక‌ర‌ణ‌ కొనసాగుతుంది. త‌దుప‌రి షెడ్యూల్ లో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్- జయరామ్- శరత్‌కుమార్ - పార్థిబాన్- ఐశ్వర్య లక్ష్మి- విక్రమ్ ప్రభు తదితరులు చేరనున్నారు. ఇంత భారీ స్టార్ కాస్ట్ తో సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేయ‌గా.. ఫిబ్ర‌వ‌రి చివరి వరకు చిత్రీక‌ర‌ణ సాగుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనావైరస్ వ‌ల్ల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. చాలా దృశ్యాలు కఠినమైన ప్రోటోకాల్ తో ఇన్న‌ర్ లోనే చిత్రీకరిస్తున్నారు.