Begin typing your search above and press return to search.

చిరంజీవి-అరవింద్ ల సినిమా ఇకపై ఉండదా..?

By:  Tupaki Desk   |   23 March 2020 10:10 AM GMT
చిరంజీవి-అరవింద్ ల సినిమా ఇకపై ఉండదా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ లకు ఈ మధ్య సినిమాల పరంగా సాన్నిహిత్యం తగ్గిందని హాట్ టాపిక్. ఖైదీ నెంబర్ 150 సినిమా నుండి అల్లు అరవింద్ కు చిరంజీవి సినిమాను నిర్మించే అవకాశం దొరకట్లేదు. మెగాస్టార్ చిరంజీవి-అల్లు అరవింద్ ల కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కానీ రీఎంట్రీ దగ్గర నుండి ఇంతవరకు వీళ్ళ కాంబినేషన్ కుదరలేదు. రీఎంట్రీ నుండి ఇప్పటి వరకు చిరంజీవి తన కొడుకు రాంచరణ్ నిర్మాణంలోనే నటిస్తుండటం విశేషం.

కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించిన రాంచరణ్ మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి విపరీతమైన లాభాలు పొందాడు. ఆ వెంటనే మళ్ళీ మెగాస్టార్ తో పాన్ ఇండియా మూవీ 'సై రా నరసింహరెడ్డి' సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక నిర్మాణంలోకి దిగడు అని అందరూ భావించారు. ఇప్పుడైనా అల్లు అరవింద్ కి అవకాశం వస్తుందేమోనని అనుకున్నారంతా.. కానీ కొరటాల శివతో చేస్తున్న సినిమాను కూడా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటంతో అరవింద్ కి అవకాశం లేకుండా పోయింది.

ఇక తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి-రాంచరణ్ లు అల్లు అరవింద్ ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. మరి చిరంజీవి-అరవింద్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. అరవింద్ నిర్మాణంలో సినిమా మాత్రం ఈ మధ్య కాలంలో రాదని స్పష్టం అయింది. చూడాలి మరి సరైన కారణాలు ఏంటో మెగా ఫ్యామిలీ జవాబు చెప్పాల్సి ఉంది.