Begin typing your search above and press return to search.

రాజీ కుదరడం తో సైలెంట్‌ అయ్యిందా?

By:  Tupaki Desk   |   18 Dec 2018 4:47 AM GMT
రాజీ కుదరడం తో సైలెంట్‌ అయ్యిందా?
X
ఇండియాలో మీటూ ఉద్యమం ఈ స్థాయి లో రావడానికి ప్రధాన కారణం తనూశ్రీ దత్తా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె చాలా సంవత్సరాల క్రితం తన పై నానా పటేకర్‌ చేసిన లైంగిక వేదింపులను ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు వచ్చింది. నానా పటేకర్‌ వంటి స్టార్‌ అప్పుడు అలా చేయడం వల్ల చెప్పలేక పోయాను, కాని ఇప్పుడు చెబుతున్నాను అంటూ తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేయడంతో మెల్ల మెల్లగా వివాదం రాజుకుంది.

ఈ వివాదంలో బాలీవుడ్‌ రెండుగా చీలిపోయింది. కొందరు నానా పటేకర్‌ కు మద్దతు తెలిపితే మరి కొందరు తనూశ్రీ దత్తాకు బాసటగా నిలిచారు. నానా పటేకర్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో మరి కొందరు స్టార్స్‌ కూడా మీటూ అంటూ తమ కు జరిగిన అన్యాయం గురించి మీడియాలో చెప్పుకొచ్చారు. దాంతో ఇండియా లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడినది.

నానా పటేకర్‌ పై తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకునేది లేదని, ఆయనతో న్యాయ పోరాటంకు కూడా సిద్దమే అంటూ ఆమద్య ప్రకటించిన తనూశ్రీ దత్తా గత కొన్ని రోజులుగా సైలెంట్‌ అయ్యింది. పైగా ఆమె విదేశాలకు వెళ్లింది. ఇప్పట్లో ఆమె వచ్చే అవకాశం కూడా లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఒక బడా ఫిల్మ్‌ మేకర్‌ నానా పటేకర్‌ మరియు తనూశ్రీ దత్తా విషయంలో రాజీ కుదిర్చాడని, భారీ మొత్తంలో తనూశ్రీ దత్తాకు ముట్టజెప్పడంతో ఆమె విదేశాలకు వెళ్లిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజీ కుదరడంతో తనూశ్రీ దత్తా సైలెంట్‌ అయ్యిందని బాలీవుడ్‌ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. వీరి వ్యవహారం మాత్రమే కాకుండా ఇంకా చాలా వ్యవహారాలు కూడా ఇలా రాజీతో సైలెంట్‌ అవుతున్నాయి.