Begin typing your search above and press return to search.

'F3' విషయంలో వెంకీ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..?

By:  Tupaki Desk   |   18 April 2022 10:30 AM GMT
F3 విషయంలో వెంకీ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..?
X
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ బిగ్ స్క్రీన్ మీద కనిపించక దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది. చివరగా 2019లో 'వెంకీమామ' సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు.

వెంకటేష్ నటించిన 'నారప్ప' మరియు 'దృశ్యం 2' సినిమాలో గతేడాది కరోనా పాండమిక్ టైంలో ఓటీటీలోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబడిన ఈ రెండు చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈసారి ఎలాగైనా థియేటర్స్ లోనే రావాలని డిసైడ్ అయిన వెంకీ.. ఇప్పుడు ''ఎఫ్ 3'' సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా సమ్మర్ సీజన్ లో రిలీజ్ రెడీ అవుతోంది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'F3' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది మూడేళ్ళ క్రిందట బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన 'ఎఫ్ 2' ప్రాంఛైజీలో రూపొందుతున్న సినిమా. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఫన్ - ఫస్ర్టేషన్ కు ఈసారి డబ్బు అనే ఎలిమెంట్ ని చేర్చి 'ఎఫ్ 3' సినిమాతో నవ్వులు పూయించబోతున్నారు. ఇందులో వెంకీ మామ రేచీకటి బాధితుడిగా కనిపించనున్నారు. సినిమాలో చివరి 20 నిమిషాలు వెంకటేష్ తన బెస్ట్ కామెడీని అందించాడని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కి వెంకీనే మెయిన్ అసెట్. ఆయనకు వరుణ్ తేజ్ కూడా జత కలవనున్నారు. కాకపోతే 'ఎఫ్ 3' నుంచి ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఫస్ట్ సింగిల్ - స్పెషల్ పోస్టర్లు వచ్చాయి కానీ.. అవి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేవు.

రిలీజ్ కు ఇంకా 40 రోజులు మాత్రమే ఉండటంతో 'ఎఫ్ 3' రిలీజ్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ మేకర్స్ మాత్రం సెకండ్ సింగిల్ వదలాలని ఫిక్స్ అయ్యారు. మరి త్వరలోనే ఫ్యాన్స్ ఆశించిన ప్రమోషనల్ కంటెంట్.. ఆకట్టుకునే కంటెంట్ ను విడుదల చేస్తారేమో చూడాలి.

'F3' చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ - సునీల్ - సోనాలి చౌహన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.