Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   12 July 2020 2:30 AM GMT
సూపర్ స్టార్ ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇస్తున్నాడా...?
X
కోలీవుడ్ లో విభిన్నమైన కథాంశాలతో చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ పా.రంజిత్. 'అట్టకత్తి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పా.రంజిత్ తర్వాత కార్తీ హీరోగా రూపొందించిన 'మద్రాస్' సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. సామాజిక అంశాలు.. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై కమర్షియల్ అంశాలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నారు పా రంజిత్. అలాంటి స్టోరీలతోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ను మెప్పించగలిగారు.. ఆయనతో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేయగలిగారు. రజినీకాంత్ తో తీసిన ‘కబాలి’ ‘కాలా’ సినిమాలతో పా రంజిత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ మూడో సినిమా అవకాశం కూడా పా రంజిత్ కి ఇవ్వబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాస్ చిత్రాల డైరెక్టర్ శివతో కలిసి 'అన్నాత్తే' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిపివేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అన్నాత్తే’ మూవీపై తలైవా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా తర్వాత రజినీ 'కబాలి' డైరెక్టర్ రంజిత్ తో కలిసి ఓ పొలిటికల్ డ్రామా కోసం వర్క్ చేయబోతున్నారనే న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

‘కబాలి’ ‘కాలా’ సినిమాలు మంచి సినిమాలుగా మిగిలినప్పటికీ రజినీకాంత్ స్టామినాకి తగ్గట్టు కమర్షియల్ గా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రజిని - రంజిత్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రానుందనే వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలి. అయితే ఇంతకముందే పి. వాసు దర్శకత్వంలో 'చంద్రముఖి' సీక్వెల్ కి సూపర్ స్టార్ పచ్చజెండా ఉపారని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ లారెన్స్ కూడా తలైవా నటిస్తున్న 'చంద్రముఖి' సీక్వెల్ లో నేను కూడా నటిస్తున్నానని వెల్లడించారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లలో ముందుగా ఏ మూవీని సూపర్ స్టార్ పట్టాలెక్కిస్తారో చూడాలి.