Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారెందుకు?

By:  Tupaki Desk   |   27 May 2022 10:30 AM GMT
అల్లు శిరీష్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారెందుకు?
X
ప్ర‌స్తుతం బిగ్ స్టార్స్ నుంచి మినిమ‌మ్ గ్యారెంటీ హీరో వ‌ర‌కు పాన్ ఇండియా జ‌పం చేస్తున్నారు. అందిరిలాగే తాము కూడా పాన్ ఇండియా మూవీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బిగ్ స్టార్స్ నుంచి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం ఈ త‌ర‌హాలో ఆలోచిస్తున్న హీరోల లిస్ట్ అంత‌కంత‌కు పెరిగిపోతోంది. సినిమాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూనే వున్నాయి. అయితే ఒక హీరో మాత్రం అలాంటి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌క‌పోగా సైలెంట్ ని, స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మెగా హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌` మూవీతో పాన్ ఇండియా వైడ్ గా స్టార్ గా గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వ‌సూళ్ల ప‌రంగానూ ఉత్త‌రాదిలో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఈ మూవీ త‌రువాత బ‌న్నీ `పుష్ప 2` కోసం రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ఆయ‌న సోద‌రుడు అల్లు శిరీష్ మాత్రం సినిమాల విష‌యంలో ఇప్ప‌టికీ సైలెంట్ ని, స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 2019లో మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ రీమేక్ `ఎబిసీడీ`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేదు. దాంతో కొత్త‌క‌థ‌తో రావాల‌ని రాకేష్ శ‌శి డైరెక్ష‌న్ లో ఓ ప్రేమ‌క‌థ‌ని చేస్తున్నారు. ఈ మూవీకి `ప్రేమ కాదంట‌` అనే టైటిల్ ని కూడా ప్ర‌క‌టించారు.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేశారు. అప్ప‌టి నుంచి ఇంత వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ ప్రాజెక్ట్ తో మొద‌లైన చాలా చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో, ఓటీటీల్లోకి వ‌చ్చేశాయి కూడా. కానీ ఇంత వ‌ర‌కు ఈ మూవీని రిలీజ్ చేయ‌డం లేదు, క‌నీసం ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ని కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో అల్లు శిరీష్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారెందుకు? అని అంతా ఆరాతీస్తున్నారు.

ఇదిలా వుంటే `పుష్ప‌` సినిమాతో బ‌న్నీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవ‌డం, పాన్ ఇండియా స్టార్ గా మార‌డంతో ఈ స‌క్సెస్ ని స్ఫూర్తిగా తీసుకున్న శిరీష్ త‌ను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇటీవ‌లే ఓ ద‌ర్శ‌కుడు త‌న‌కు పాన్ ఇండియా స్టార్ క‌థ వినిపించార‌ట‌. దీన్ని ఎలాగైనా ఓ రేంజ్ లో చేయాల‌ని శిరీష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ కూడా ఖ‌రారు చేసే ఆలోచ‌న‌తో శిరీష్ అండ్ డైరెక్ట‌ర్ వున్నార‌ని తెలిసింది. అయితే ఇది ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంది? అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్ గానే వుంది.