Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి రెండో కూతురిని లాంచ్ చేసేది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   1 April 2021 2:30 AM GMT
శ్రీ‌దేవి రెండో కూతురిని లాంచ్ చేసేది ఎవ‌రు?
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో క‌ర‌ణ్ జోహార్ ఆల్ టైమ్ రికార్డ్ గురించి తెలిసిన‌దే. హిందీ ప‌రిశ్ర‌మ‌లో క‌రణ్ జోహార్ .. స‌ల్మాన్ ఖాన్.. చోప్రాలు న‌ట‌వార‌సులను లాంచ్ చేయ‌డంలో పోటీప‌డుతున్నారు. అయితే వీళ్ల‌లో ఎవ‌రు ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ ను లాంచ్ చేస్తున్నారు? అన్న‌దే అస‌లైన‌ ఫ‌జిల్.

అయితే ఎట్ట‌కేల‌కు ఖుషీని లాంచ్ చేసేందుకు బోనీక‌పూర్ ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌ఖ‌నిర్మాత‌ను లాక్ చేశార‌ని తెలిసింది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రు? అంటే... ది గ్రేట్ క‌ర‌ణ్ జోహార్ అని క్లారిటీగా తెలుస్తోంది. అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ ని 2018 లో మ‌రాఠా బ్లాక్ బ‌స్ట‌ర్ సైరాఠ్ రీమేక్ తో ప‌రిచ‌యం చేశారు. ల‌వ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `ధడక్` తో జాన్వీ లాంచ్ సాఫీగా సాగిపోయింది. జాన్వీ కెరీర్ ప‌రంగా ఎదురే లేని స్థాయికి ఎదిగింది అంటే అది క‌ర‌ణ్ వ‌ల్ల‌నే. అత‌డే ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ ని కూడా లాంచ్ చేస్తారు.

తాజా స‌మాచారం మేర‌కు.. కరణ్ జోహార్ కొత్తగా ప్రారంభించిన బ్యానర్ ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీ ద్వారా ఖుషీ కపూర్ ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తార‌ని తెలిసింది. ఎట్ట‌కేల‌కు ఖుషీ లాంచింగ్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన ఘ‌నంగా వెలువ‌డ‌నుంద‌ట‌.

ఖుషీ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్సు చదువుతున్నారు. త‌న‌కు అన్నివిధాలా స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేందుకు త‌న సోద‌రి జాన్వీ క‌పూర్ ఇటీవ‌లే అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. లాంచింగ్ కి ముందే ఖుషీని ప‌క్కాగా ప్రిపేర్ చేయాల‌న్న‌ది త‌న ప్లాన్. కెమెరా ముందు శ్రీ‌దేవి పెద్ద కుమార్తె అద‌ర‌గొట్టేస్తోంది. ఇప్పుడు చిన్న కుమార్తె ఏమేర‌కు రాణించ‌నుందో వేచి చూడాలి. బోనీక‌పూర్- క‌ర‌ణ్ నుంచి ఆ పెద్ద ప్ర‌క‌ట‌న కోస‌మే వెయిటింగ్.