Begin typing your search above and press return to search.

`రాధేశ్యామ్‌` డైరెక్ట‌ర్ నెక్స్ట్ స్టెప్ ఏంటీ?

By:  Tupaki Desk   |   25 Feb 2022 2:51 AM GMT
`రాధేశ్యామ్‌` డైరెక్ట‌ర్ నెక్స్ట్ స్టెప్ ఏంటీ?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా క్రేజీ మూవీ `రాధేశ్యామ్‌`. ఈ మూవీ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. `సాహో` త‌రువాత ప్ర‌భాస్ సినిమా వ‌చ్చి దాదాపు 4 ఏళ్లవులోంది. కోవిడ్ కార‌ణంగా రెండేళ్లు ప్ర‌భాస్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌లేదు. ఆ త‌రువాత సెకండ్‌, థ‌ర్డ్ వేవ్ ల కార‌ణంగా ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాలు ఒక్కొక్క‌టిగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చాయి. అయితే `రాధేశ్యామ్‌` ఫైన‌ల్ గా పూర్త‌యి రిలీజ్ కు రెడీ అయింది. జ‌న‌వ‌రి 14న ఈ మూవీని ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అయితే థ‌ర్డ్ వేవ్ .. ఒమిక్రాన్ ల కార‌ణంగా సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్లీ `రాధేశ్యామ్‌` ని మార్చి 11న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేయ‌బోతున్నారు. విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. విధిరాత‌కు - ప్రేమ‌కు మ‌ధ్య సాగే గ‌మ్మ‌త్తైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించారు.

ఈ నెల 25 నుంచి ఈ మూవీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో భాగంగా `ఈ రాత‌లే ..`అంటూ సాగే సాంగ్ ప్రోమోని గురువారం విడుద‌ల చేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఈ లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్స్ ని మ‌రింత స్పీడ‌ప్ చేయ‌డానికి చిత్ర బృందం స‌రికొత్త ప్లాన్ లు చేస్తోంది. ఇదిలా వుంటే సెకండ్ ఫిల్మ్ తో పాన్ ఇండియా స్థాయి డైరెక్ట‌ర్ ల జాబితాలో చేరిపోతున్న రాధాకృష్ణ కుమార్ ఈ మూవీ త‌రువాత ఏం చేయ‌బోతున్నాడు?

`రాధేశ్యామ్‌` త‌రువాత ఆయ‌న ఎవ‌రితో సినిమా చేస్తాడు? .. అది ఏ స్థాయిలో వుంటుంద‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. రాధాకృష్ణ కుమార్ తొలి చిత్రం `జిల్‌`. గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ చిత్రం 2015లో విడుద‌లై ఇప్ప‌టికి ఏడేళ్లు దాటింది. రెండ‌వ సినిమా కోసం ఓ ద‌ర్శ‌కుడు ఏడేళ్ల‌కు మించి ఎదురుచూడ‌టం మామూలు విష‌యం కాదు. ఫ‌స్ట్ సినిమాని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ రెండ‌వ చిత్రం `రాధేశ్యామ్‌`ని కూడా అత‌నితోనే నిర్మించింది. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ తో మూడ‌వ చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మించ‌నుంద‌ట‌.

ఇందు కోసం ఇప్ప‌టికే అత‌నితో యువీ వ‌ర్గాలు అగ్రిమెంట్ చేసుకున్నాయ‌ని, త‌దుప‌రి చిత్రాన్ని కూడా `రాధేశ్యామ్‌` త‌ర‌హాలోనే భారీ స్థాయిలో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో న‌టించ‌బోయే హీరో ఎవ‌రు? .. క‌థ ఏంటీ? అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. యువీ సంస్థ ఇప్ప‌టికే కొంత మంది స్టార్ హీరోల‌కు అడ్వాన్స్ ఇచ్చేసింది. అందులో రామ్ చ‌ర‌ణ్ కూడా వున్నారు.