Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హోస్ట్ చేయాల్సిన గేమ్ షో పరిస్థితి ఏంటి..?

By:  Tupaki Desk   |   26 May 2021 2:30 AM GMT
ఎన్టీఆర్ హోస్ట్ చేయాల్సిన గేమ్ షో పరిస్థితి ఏంటి..?
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'బిగ్ బాస్' షో ద్వారా స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటారు. ఈ క్రమంలో బుల్లితెరపై మరోసారి సందడి చేయడానికి తారక్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ''ఎవరు మీలో కోటీశ్వరులు'' అనే రియాలిటీ గేమ్ షో ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్.. జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలతో ‘ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. అలానే ఈ గేమ్ షో కు సంబంధించిన ప్రశ్నలకు కూడా అడిగాడు. మరికొన్ని రోజుల్లో ఈ షో ప్రసారం అవుతుందని భావిస్తుండగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ క్రమంలో గేమ్ షో ని క్యాన్సిల్ చేశారనే రూమర్స్ కూడా వచ్చాయి.

కరోనా రెండవ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం నిర్వాహకులకు కష్టంగా మారినట్లు సమాచారం. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో షూట్ చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ షో ని రద్దు చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వాయిదా వేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ కరోనా బారి నుంచి బయటపడ్డప్పటికీ.. సెకండ్ వేవ్ కారణంగా హోల్డ్ లో పెడితేనే మంచిదని నిర్వాహకులు భావిస్తున్నారట. కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టులో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' గేమ్ షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే తారక్ ఈ షో కోసం సుమారు 10 కోట్ల రూపాయలు అందుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది.