Begin typing your search above and press return to search.

మహేష్‌ తో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ భేటీకి కారణం ఏంటో?

By:  Tupaki Desk   |   11 Oct 2019 2:30 PM GMT
మహేష్‌ తో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ భేటీకి కారణం ఏంటో?
X
'బాహుబలి' స్థాయిలో సౌత్‌ ఇండియాలో సంచలన విజయాన్ని దక్కించుకున్న చిత్రం 'కేజీఎఫ్‌'. బాలీవుడ్‌ స్టార్స్‌ మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఆశ్చర్యపోయి మరీ చూసిన 'కేజీఎఫ్‌' చిత్రం ప్రస్తుతం రెండవ పార్ట్‌ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ నీల్‌ కు భారీ క్రేజ్‌ దక్కంది. బాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు సౌత్‌ స్టార్‌ హీరోలు చాలా మంది ఈయన దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేజీఎఫ్‌ 2 చిత్రం తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తో సినిమాను చేసేందుకు మైత్రి మూవీస్‌ వారు ఒప్పందం చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా మైత్రి మూవీస్‌ వారి సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత చేయబోతున్న సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తాడని అంతా భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా మహేష్‌ బాబు మరియు ప్రశాంత్‌ నీల్‌ ల భేటీ జరుగబోతుంది. వీరిద్దరి భేటీకి కారణం ఏంటీ అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ.. అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల ప్రచారం జరుగుతోంది.

కేజీఎఫ్‌ 2 తర్వాత మహేష్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేయాలనుకుంటున్నాడని.. అందుకే తన వద్ద ఉన్న ఒక కథను చెప్పేందుకు మహేష్‌ ను ప్రశాంత్‌ టైం అడిగి ఉంటాడని కొందరు అంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం ఎన్టీఆర్‌ తో సినిమా తర్వాత మహేష్‌ తో సినిమా కోసం ప్రశాంత్‌ కథను సిద్దం చేస్తూ ఉన్నాడేమో అంటూ గెస్‌ చేస్తున్నారు. మొత్తానికి త్వరలో మహేష్‌ ను కలువబోతున్న ప్రశాంత్‌ నీల్‌ నోరు తెరిస్తే తప్ప అసలు విషయమై క్లారిటీ రానుంది