Begin typing your search above and press return to search.

ముంబైలో ఆ క్రేజ్‌ ఏంటి సామీ

By:  Tupaki Desk   |   22 Dec 2021 7:35 AM GMT
ముంబైలో ఆ క్రేజ్‌ ఏంటి సామీ
X
టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో జ‌క్క‌న్న రాజ‌మౌళికున్న ప్ర‌త్యేక‌త వేర‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. సినిమాల‌కు క‌థల్ని ఎంచుకోవ‌డంలోనూ, ఆ క‌థ‌ల్ని మాసీవ్‌గా ప్రేక్ష‌కుల‌కు రీచ్ చేయ‌డంలోనూ రాజ‌మౌళిని మించిన వారు లేరంటే అది అతిశ‌యోక్తి కాదేమో. ఈ అంశం ప్ర‌తీ టాలీవుడ్ సినీ ల‌వ‌ర్ తో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌తీ ఒక్క‌రూ యునానిమ‌స్‌గా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే `బాహుబ‌లి` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌మోట్ చేయ‌డంలో రాజ‌మౌళి ప్ర‌ద‌ర్శించిన ఇంట‌లిజెన్సీ... ఆ చిత్రాన్ని బాలీవుడ్ లో ప్ర‌మోట్ చేసిన తీరు పాన్ ఇండాయా స్థాయిలో తెలుగు సినిమాకు నీరాజ‌నాలందుకునేలా చేసింది.

సినిమా తీయ‌డంలోనే కాదు దాన్ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలోనూ రాజ‌మౌళి స్క్రీన్ ప్లే అదుర్స్ అన్నారంతా. ఇప్పుడ‌దే స్క్రీన్ ప్లేని `RRR` కు కూడా అప్లై చేస్తున్నారు రాజ‌మౌళి. ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత వారం మాత్ర‌మే గ్యాప్ తీసుకుని రాజ‌మౌళి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ని హోరెత్తించిన ఆవిష‌యం తెలిసిందే. ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత ఆ క్రేజ్‌ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇండియా వ్యాప్తంగా రాజ‌మౌళి త‌న టీమ్ తో ప్ర‌చారం చేయించ‌డం మొద‌లుపెట్టాడు. ఇదే `RRR` ని టాక్ ఆఫ్ ది ఇండియా గా మార్చింది.

ఈ విష‌యంలో రాజ‌మౌళి ప్ర‌ద‌ర్శించిన ఇంట‌లిజెన్సీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డ‌మే కాకుండా సినిమాకు ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చింది. దీంత ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాకు క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం అని అప్పుడే ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ కూడా మొదలైంది. ఇదిలా వుంటే దేశ వ్యాప్తంగా `RRR` ప్రాజెక్ట్ ని హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియాగా నిల‌బెట్టిన రాజ‌మౌళి అండ్ టీమ్ ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ ని మొత్త బాలీవుడ్ పైనే పెట్టింది.

ముంబైలో భారీ ఖ‌ర్చులో ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని నిర్వ‌హించింది. ఈ ఈవెంట్ కు స‌ల్మాన్ ఖాన్ ఛీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈవెంట్ హ్యూజ్ స‌క్సెస్ సాధించింది. అయినా టీమ్ మాత్రం ముంబైని వీడి హైద‌రాబాద్ రాలేదు. అక్క‌డే మ‌కాం వేశారు. టీమ్ అంతా అక్క‌డి టాప్ మీడియా సంస్థ‌ల‌కు వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు, టీవీ షోల్లో పాల్గొన‌డం మొద‌లుపెట్టారు. వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో బిజీగా వున్నారు. ఇందులో క‌పిల్ శ‌ర్మ షో కూడా ఒక‌టి. దీంతో అక్క‌డే ప్ర‌చారం కోసం ఫుల్ ప్యాక్ అయిపోయిన `RRR` టీమ్ అవ‌న్నీ పూర్తి చేసుకున్న త‌రువాతే హైద‌రాబాద్ రావాల‌ని ఫిక్స్ అయింద‌ట‌.

బ్లాక్ బ‌స్ట‌ర్ కు మించి రిజ‌ల్ట్ ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రాజ‌మౌళి త‌న ఫుల్ కాన్స‌ట్రేష‌న్ ని అంతా బాలీవుడ్ మీడియాపైనే పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ పై రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ తో వున్నార‌ట‌. ఆ కార‌ణంగానే హ్యూజ్ గా బాలీవుడ్ లో ప్ర‌చారం చేస్తున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అతే కాకుండా `RRR` టీమ్‌కు ముంబైలో భారీ క్రేజ్ పెర‌గ‌డం కూడా టీమ్ ముంబైని వీడి రాలేక అక్క‌డే వ‌రుస ప్ర‌చార మాధ్య‌మాల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంద‌ని, టాలీవుడ్ సినిమాకు బాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఏంటీ సామీ అని మ‌న వాళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.