Begin typing your search above and press return to search.

రౌడీ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 12:30 AM GMT
రౌడీ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం జరుగుతోంది..?
X
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవర‌కొండ. 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న వీడీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా యువ హీరో కెరీర్ ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు.

'డియకర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో నిరాశ పరిచిన VD.. ఇటీవల 'లైగర్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులో ఒకటిగా చేరింది. ఈ నేపథ్యంలో ఈసారి సాలిడ్ సక్సెస్ అందుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నాడు.

భారీ పరాజయం తర్వాత వీలైనంత త్వరగా తిరిగి ఫార్మ్ లోకి రావాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ కు ఏదీ కలిసి రావడం లేదు. 'లైగర్' రిలీజ్ అవ్వకముందే 'JGM' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటుగా 'ఖుషీ' వంటి పాన్ సౌత్ ఇండియా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు VD.

అయితే 'లైగర్' ప్లాప్ తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రారంభించిన 'జనగణమన' చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ హీరోగా నటిస్తున్న 'ఖుషి' సినిమా షూటింగ్ ప్లాన్స్ అనుకున్న విధంగా జరగడం లేదు.

'ఖుషి' లో హీరోయిన్ గా నటిస్తోన్న సమంత రూత్ ప్రభు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఆమె మైయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుండటంతో ఇప్పుడప్పుడే సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం లేదనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా విజయ్'D లైన్ లో పెట్టుకున్న ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం.. మరో సినిమా ఆలస్యం అవుతుండటంతో.. కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేసే పనిలో పడ్డాడని.. దర్శకుల నుంచి వరుసగా స్క్రిఫ్ట్‌ లను వింటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అంతేకాదు ఇప్పుడు సమంత అందుబాటులో లేకపోవడంతో 'ఖుషి' సినిమాని వెనక్కి నెట్టి.. గౌతమ్ ప్రాజెక్ట్ ని విజయ్ సెట్స్‌ పైకి తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. మరోవైపు రామ్ చరణ్ తో గౌతమ్ చేయాల్సిన సినిమా కూడా అటకెక్కిందని అంటున్న నేపథ్యంలో.. VD మూవీ ఫిక్స్ అయినట్లేనని అనుకున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ దేవరకొండ కొత్త సినిమా పట్టాలెక్కేలోపు.. 'ఖుషి' చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. నవంబర్ 20న ఈ షూటింగ్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సామ్ కచ్చితంగా తిరిగి సెట్స్ లో అడుగుపెడుతుందనే నమ్మకంతో టీమ్ ఉందట. ఆమెకి ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలిగించకుండా.. అందుబాటులో ఉండటాన్ని బట్టే చిత్రీకరణ చేయనున్నారని అంటున్నారు.

ఇకపోతే గౌతమ్ తిన్ననూరి చెప్పిన లైన్ కు విజయ్'D సూత్రప్రాయంగా ఓకే చెప్పారని టాక్. బౌండ్ స్క్రిప్ట్ నేరేట్ చేసిన తర్వాతే ఫైనల్ కాల్ తీసుకుంటారని నివేదికలు పేర్కొన్నాయి. ఒకవేళ వీడీ దీనికి పచ్చజెండా ఊపితే దిల్ రాజు బ్యానర్ లో వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.