Begin typing your search above and press return to search.

బుమ్రాతో పెళ్లిపై అనుప‌మ మామ్ ఏమ‌న్నారు?

By:  Tupaki Desk   |   6 March 2021 10:30 AM GMT
బుమ్రాతో పెళ్లిపై అనుప‌మ మామ్ ఏమ‌న్నారు?
X
టీమిండియా ఆట‌గాడు బుమ్రాతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి గ‌త కొంత‌కాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఫాస్ట్ బౌలర్ జస్ ‌ప్రీత్ బుమ్రా పెళ్లి కోసం సెల‌వు పెట్టాడ‌న్న వార్త క్ష‌ణాల్లో దావాన‌లంలా మారిన సంగ‌తి తెలిసిన‌దే. యువ‌ఫేస‌ర్ అందాల క‌థానాయిక‌ అనుపమ పరమేశ్వరన్ విసిరిన బౌన్స‌ర్ కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడ‌ని ..నేడో రేపో పెళ్లాడేయ‌బోతున్నాడ‌ని ప్రచారమైంది.

వ్యక్తిగత కారణాల వల్ల అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ ‌తో జరిగిన నాలుగో టెస్టుకు ముందు జస్ ప్రీత్ బుమ్రా భారత జట్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం ఇదంతా ప్ర‌చార‌మైంది. ఇది నిజ‌మా? అంటే.. అనుపమ తల్లి సునీతా పరమేశ్వరన్ ఈ పుకార్ల‌ను తోసిపుచ్చారు.

తన కుమార్తె .. జస్‌ప్రీత్ బుమ్రా మంచి స్నేహితులు మాత్రమే అని సునీతా పరమేశ్వరన్ మనోరమా ఆన్ ‌లైన్ ‌కు చెప్పారు. వాస్తవానికి అనుపమ 27 ఏళ్ల భారతీయ స్పీడ్ స్టర్ తో డేటింగ్ చేయడాన్ని కూడా ఖండించారు. వారు కేవలం మంచి సహచరులు అని పేర్కొంటూ ఆమె గాలివార్త‌ల్ని కొట్టిపారేశారు. గ‌తంలోనూ బుమ్రా అందాల కథానాయిక‌ రాశి ఖన్నాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇన్ ‌స్టాగ్రామ్ లో ఒకరినొకరు అనుసరించడం ఇష్టపడని వారు జస్ ‌ప్రీత్ బుమ్రా- అనుపమ పరమేశ్వరన్ లను కలిపే వార్తా కథనాలను సృష్టించారని సునీతా పరమేశ్వరన్ వ్యాఖ్యానించడం ఆసక్తిక‌రం. ఇలాంటి అవాస్తవ కథనాలు బయటపడిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అనుసరించడం మానేశారని కూడా ఆమె వెల్ల‌డించారు. జస్ప్రీత్ - అనుపమా ఒక హోటల్ లో షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు మొదటిసారి కలుసుకున్నారని అప్పుడు కూడా అలాంటి పుకార్లు ఎక్కడా బయటపడలేదని సునీత వెల్లడించారు.

"అందరూ అనుపమపై గాసిప్పుల‌ గురించి మరచిపోవటం ప్రారంభించినప్పుడు ఇలాంటి ఏదో ఒక కొత్త క‌థ‌ కనిపిస్తుంటుంది. మేము దానిని సానుకూల కోణంలో మాత్రమే తీసుకుంటాము. అంతకుముందు అనుపమ- బుమ్రాలను కలిపే కథనాలు చాలా ఉన్నాయి. ఈ కథలు ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఇద్ద‌రూ ఒకరినొకరు అనుసరించడం ఇష్టపడని వారు సృష్టించారని నేను భావిస్తున్నాను. ఇలాంటి అవాస్తవ కథలు వ్యాపించిన తర్వాత వారు సామాజిక మాధ్య‌మాల్లోనూ దూర‌మ‌య్యారు`` అని సునీత‌ తెలిపారు.

నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న తరువాత జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల‌ టి 20 ఐ సిరీస్ కి హాజ‌రు కాడ‌ని తెలుస్తోంది. అత‌డు నేరుగా ఐపిఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ కోసం తిరిగి మైదానంలోకి వస్తాడు. బుమ్రా భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా ముంబై ఇండియన్స్ టీమ్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.