Begin typing your search above and press return to search.

సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారిపై సిరీస్‌..!

By:  Tupaki Desk   |   3 July 2022 7:32 AM GMT
సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారిపై సిరీస్‌..!
X
సినిమా ఇండస్ట్రీ ని సుదీర్ఘ కాలంగా పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. ఈ పైరసీ భూతం ను ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా వారు అంతకు మించి టెక్నాలజీని వాడుతూ పైరసీ తీసుకు వస్తున్నారు. సౌత్‌ సినిమా ను నాశనం చేయడమే లక్ష్యం అన్నట్లుగా తమిళ్‌ రాకర్స్ సినిమా ను పైరసీ చేస్తూ ఆన్‌ లైన్ లో పెట్టడం చేస్తున్నారు.

తమిళ్‌ రాకర్స్ ముందస్తుగా చెబుతూ పైరసీ చేస్తూ నిర్మాతలకు సవాల్‌ విసురుతూ సినిమా ఇండస్ట్రీ మనుగడ కు ఒకానొక సమయంలో సవాల్ విసిరారు. ఈ మధ్య కాస్త తమిళ్‌ రాకర్స్ తగ్గినా కూడా ఇంకా కూడా కొత్త సినిమా లు థియేటర్ల ద్వారా విడుదల అయిన వాటిని పైరసీ చేస్తూ నిర్మాతలకు నష్టాలు మిగిలేలా చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సర్కిల్‌ ఉంది.

ఇప్పుడు ఈ తమిళ రాకర్స్ గురించి ఒక వెబ్‌ సిరీస్‌ ను తీసుకు రాబోతున్నారు. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు పడ్డ కష్టాలు.. ఎలాంటి పరిస్థితి వీరు ఎదుర్కొన్నారు అనే విషయాలను ఈ వెబ్‌ సిరీస్ లో చూపించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెబ్‌ సిరీస్‌ ను తమిళ ప్రముఖ దర్శకుడు అరివళగన్ తెరకెక్కిస్తున్నాడు.

ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అరివళగన్ విభిన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ వెబ్‌ సిరీస్ లో తమిళ స్టార్‌ నటుడు అయిన అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ వెబ్‌ సిరీస్ కూడా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

తమిళ్‌ రాకర్స్ వల్ల దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే పేరుతో వెబ్‌ సిరీస్‌ అనడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళ్‌ రాకర్స్ వెబ్‌ సిరీస్ గురించిన అధికారిక ప్రకటన రావడంతో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు. ఈ తమిళ్ రాకర్స్ లో ఉండబోతున్న అంశాలు ఏంటీ అనేది మరి కొన్నాళ్లకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేయబోతుందట.