Begin typing your search above and press return to search.

'నేను నరేంద్ర మోదీ అభిమానిని.. కానీ ఇకపై కాదు'

By:  Tupaki Desk   |   15 March 2021 10:10 AM GMT
నేను నరేంద్ర మోదీ అభిమానిని.. కానీ ఇకపై కాదు
X
మంచు ఫ్యామిలీ గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనను కొనియాడిన సంగతి తెలిసిందే. అప్పట్లో మోహన్ బాబు - మంచు విష్ణు సహా ఫ్యామిలీ మొత్తం మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో మంచు కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో మోదీని ఉద్దేస్తూ విష్ణు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది.

'మోసగాళ్ళు' సినిమా మార్చి 19న విడుదల అవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే నేను ఆయన్ని అభిమానించే వాడిననే విషయం అందరికీ తెలుసు. కానీ ఇకపై అలా ఉండదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ను ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో ఉన్న ప్లాంటును లాభాల్లో నిర్వహిస్తామని చెపుతున్నప్పుడు.. అది ప్రభుత్వానికి ఎందుకు సాధ్యంకాదు?'' అని ప్రశ్నించారు.

ఇటీవల మంచు విష్ణు వైజాగ్ లో పర్యటించినప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ఉద్యమం నేపథ్యంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందని.. కానీ రాజకీయ కారణాలతో ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.