Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ కార్యక్రమానికి అంబాసిడర్ గా విశాల్ తండ్రి

By:  Tupaki Desk   |   3 Sep 2021 5:30 PM GMT
ప్రధాని మోడీ కార్యక్రమానికి అంబాసిడర్ గా విశాల్ తండ్రి
X
ప్రముఖ తమిళ హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమానికి అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి ఒక ఫిట్ నెస్ ట్రైనర్. ఆయన చాలా సరికొత్త ఎక్సర్ సైజ్ లు చేస్తూ వీడియోలు రిలీజ్ చేసి వైరల్ అయ్యారు.

ఈ క్రమంలోనే తాజాగా విశాల్ తండ్రి జీకే రెడ్డి ఏకంగా భారత ప్రభుత్వ ఫిట్ ఇండియా ఉద్యమానికి అంబాసిడర్ గా నియమించబడడం విశేషంగా మారింది.

ఫిట్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ప్రధాని మోడీ దీనికి అమిత ప్రాథాన్యం ఇస్తుంటాడు. 2019లో మోడీ దీన్ని ప్రారంభించాడు. మిషన్ డైరెక్టర్ తాజాగా జీకేరెడ్డిని అంబాసిడర్ గా అపాయింట్ మెంట్ చేస్తూ సందేశం పంపారు.

‘ఫిట్ నెస్ అరేనాలో ప్రముఖ పేరుగా.. ఫిట్ నెస్ ను ఒఖ జీవన విధానంగా మార్చుకునేందుకు.. భారత దేశాన్ని ఫిట్ నేషన్ గా మార్చేలా ప్రజలను చైతన్యపరిచే శక్తి మీకు ఉంది’ అని ప్రధాని కార్యాలయం నుంచి జీకేరెడ్డికి సందేశం వచ్చింది.

ప్రస్తుతం 80 ఏళ్ల వయసున్న జీకే రెడ్డి ఫిట్ నెస్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంబాసిడర్ పదవి లభించడం ఆయనకు సంతోషాన్నిచ్చింది. హీరో విశాల్ తన తండ్రికి ఈ గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.