Begin typing your search above and press return to search.

ఎలక్షన్స్ అయిపోయాయి.. వెంటనే సినిమాల మీద పడ్డాడు..!

By:  Tupaki Desk   |   7 April 2021 12:30 PM GMT
ఎలక్షన్స్ అయిపోయాయి.. వెంటనే సినిమాల మీద పడ్డాడు..!
X
లోకనాయకుడు కమల్ హాసన్ - డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో 'విక్రమ్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఇండియన్ 2' లేట్ అవుతుండటంతో కమల్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఆయన కెరీర్లో 232వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని కమల్ హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే 'మక్కల్‌ నీది మయ్యమ్‌' పార్టీ అధ్యక్షుడైన కమల్.. తమిళనాడు ఎన్నికల పనుల్లో బిజీ అవడంతో షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నారు.

అయితే నిన్న మంగళవారం తమిళనాడు అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఎలక్షన్స్ రిజల్ట్ కోసం వేచి చూడకుండా, కమల్ వెంటనే 'విక్రమ్' సినిమా పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ 'ఆరంభిద్దామా' అని సినిమాలోని డైలాగ్ ని క్యాప్షన్ గా పెట్టాడు. ఇకపోతే 'విక్రమ్' చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని.. 2021 సంవత్సరానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుపుతామని మేకర్స్ అనౌన్స్ మెంట్ అప్పుడే ప్రకటించారు. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'ఖైదీ' 'మాస్టర్' వంటి సూపర్ హిట్స్ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'విక్రమ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.