Begin typing your search above and press return to search.

కియారా ఇంటి త‌లుపు త‌ట్టిన విజ‌య్!

By:  Tupaki Desk   |   22 Feb 2022 5:30 AM GMT
కియారా ఇంటి త‌లుపు త‌ట్టిన విజ‌య్!
X
రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోంది. ఇటీవ‌లే `లైగ‌ర్` చిత్రం షూటింగ్ పూర్తిచేసాడు. మ‌ళ్లీ అదే ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తో `జ‌న‌గ‌ణ‌మ‌న `చిత్రాన్ని చేయ‌డానికి రెడీ అవుతు న్నాడు .సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోసం సిద్దం చేసిన స్ర్కిప్ట్ ని పూరి ఏకంగా విజ‌య్ తోనే తెర‌కెక్కిస్తున్నాడు. ఇది యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా..మ‌హేష్ రేంజ్ హీరోలు చేసే స్ర్కిప్ట్ .

కానీ పూరి `జ‌న‌గ‌ణ‌మ‌న‌`తో ఆ ఇమేజ్ ని విజ‌య్ కి అందించాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. ఆ క‌మిట్ మెంట్ తోనే ధైర్యంగా బ‌రిలోకి దిగుతున్నారు. పూరి అనుకున్నారంటే? సాధిస్తారు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల‌కు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ద‌ర్శ‌కుడాయ‌న‌. ఆ నమ్మ‌కంతోనే విజ‌య్ ని `జ‌న‌గ‌ణ‌మ‌ని` లాక్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని `లైగ‌ర్` రిలీజ్ కంటే ముందుగానే పూర్తిచేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

`లైగ‌ర్` రిలీజ్ అయిన వెంట‌నే `జ‌న‌గ‌ణ‌మ‌న` కూడా రిలీజ్ చేసేలా పూరి ద‌గ్గ‌ర ప్లాన్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక మ‌రోవైపు విజ‌య్ -యంగ్ మేక‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకి క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఫైన‌ల్ వెర్ష‌న్ స్ర్కిప్ట్ లాక్ అయింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఇందులో హీర‌యిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

మేక‌ర్స్ అప్పుడే సంప్ర‌దింపులు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. సినిమాకి పాన్ అప్పీల్ తీసుకురావ‌డానికే కియారాని లాక్ చేయాల‌ని చూస్తున్నారు. కియారాకి బాలీవుడ్ లో మంచి పేరుంది. ఇటీవ‌లే `షేర్ షా`తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడామె రేంజ్ ఉత్త‌రాదిన రెట్టింపు అయింది. ఇక తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆర్ సీ 15లో నూ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాన్ ఇండియా అప్పీల్ వ‌చ్చింది. ఇలా కియారా పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్-శివ ద్వయం కియారాని రంగంలోకి దించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఛాన్స్ వ‌స్తే గ‌నుక కియారా కోరిక తీరుతుంది. విజ‌య్ తో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పిన ఉత్త‌రాది భామ‌ల్లో కియారా కూడా ఒక‌రు. వాళ్ల‌కు రాని అవ‌కాశం ఇప్పుడు కియార ఇంటి త‌లుపు త‌డుతుండ‌టం విశేషం.

ఇక చ‌ర‌ణ్ తో కియారా న‌టించడం రెండ‌వ‌సారి. గ‌తంలో బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన `విన‌య విధేయ రామ`లో కియారా హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌లమైంది. అయినా శంక‌ర్ ప్లాప్ సెంటిమెంట్ ని ప‌ట్టించుకోకుండా కియారాని త‌న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం చేసారు.