Begin typing your search above and press return to search.

మేలో పట్టాలెక్కనున్న మక్కల్ సెల్వన్ థ్రిల్లర్ మూవీ..!

By:  Tupaki Desk   |   28 April 2021 6:35 AM GMT
మేలో పట్టాలెక్కనున్న మక్కల్ సెల్వన్ థ్రిల్లర్ మూవీ..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి జంటగా ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ రూపొందించనున్నాడు. ఇదివరకు అందధున్ అనే నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఇప్పుడు కత్రినా - విజయ్ లతో సినిమా ప్రకటించే సరికి సినిమా పై ఆసక్తి ఏర్పడింది. ఇదివరకే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవలే ఈ థ్రిల్లర్ మూవీకి 'మేరీ క్రిస్మస్' అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాను రమేష్ టౌరని, సంజయ్ రౌత్రే సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మేరీ క్రిస్మస్ మూవీ షూటింగ్ వచ్చే నెల అంటే మే నెలలో ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ మే రెండో వారం ప్రారంభించి సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు మేకర్స్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ముంబైలో పరిస్థితి బాగాలేనందుకు సినిమా షూట్ గోవాలో ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కత్రినా చేతినిండా భారీ సినిమాలతో బిజీగా ఉంది. సల్మాన్ సరసన టైగర్-3 చేస్తూనే మరోవైపు ఫోన్ బూత్, సూర్యవంశీ, అలీ అబ్బాస్ జాఫర్ సినిమాలు లైన్ లో పెట్టింది. మరోవైపు విజయ్ కూడా అసలు ఖాళీ లేకుండా తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చూడాలి మరి మే లో అయినా షూటింగ్ మొదలవుతుందేమో..!