Begin typing your search above and press return to search.

విజ‌య్‌ ఫ్యాన్స్ వ‌ర్సెస్ యాంటీ ఫ్యాన్స్ ర‌చ్చ షురూ!

By:  Tupaki Desk   |   14 Nov 2022 9:30 AM GMT
విజ‌య్‌ ఫ్యాన్స్ వ‌ర్సెస్ యాంటీ ఫ్యాన్స్ ర‌చ్చ షురూ!
X
త‌మిళ సూప‌ర్‌స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ‌స్ట్ టైమ్ తెలుగు డైరెక్ట‌ర్ వంశ‌ధీ పైడి ప‌ల్లి, నిర్మాత దిల్ రాజుల‌తో క‌లిసి చేస్తున్న మూవీ 'వారీసు'. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు'గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ముందు నుంచి త‌మిళ మూవీ అంటూ హీరో విజ‌య్‌, నిర్మాత దిల్ రాజు ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్న ఈ మూవీని రెండు భాష‌ల్లోనూ సంక్రాంతికి భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే భారీ స్కెచ్ తో సంక్రాంతి బ‌రిలో ఈ మూవీని నిల‌పాల‌ని థియేట‌ర్ల వారితో అగ్రిమెంట్ ని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో సంక్రాంతి బ‌రిలో రిలీజ్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ 'వీర సింహారెడ్డి' సినిమాల‌కు మెయిన్ థియేట‌ర్స్ ల‌భించ‌ని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. మ‌రీ ముఖ్యంగా దిల్ రాజు 'వార‌సుడు' కార‌ణంగా నంద‌మూరి బాల‌కృష్ణ 'వీర సింహారెడ్డి'కి ప్ర‌ధాన థియేట‌ర్లు లభించ‌డం లేదని తెలుస్తోంది.

థియేట‌ర్ల వివాదంపై ఆల‌స్యంగా క‌ళ్లు తెరిచిన ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ గ‌తంలో చేసుకున్న ఒప్పందం ప్న‌కారం పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కే తొలి ప్ర‌ధాన్య‌త నివ్వాల‌ని, ఆ త‌రువాతే డ‌బ్బింగ్ సినిమాల గురించి ఆలోచించాల‌ని కోరింది.

దిల్ రాజు ఒకే స‌మ‌యంలో విజ‌య్ 'వార‌సుడు', అజిత్ 'తునీవు'ల‌ని విడుద‌ల చేస్తూ వాటి కోసం భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసుకున్నార‌ట‌. ఇది తెలిసిన ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఎట్ట‌పరిస్థితుల్లోనూ పండ‌గ సీజ‌న్ లో డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌రాదంటూ ఎగ్జిబిట‌ర్ల‌ని ఉద్దేశిస్తూ ఓ బ‌హిరంగ లేఖ‌ని విడుద‌ల చేసింది.

ఈ నేప‌థ్యంలో దిల్ రాజు 'వార‌సుడు' రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం వుంద‌ని, జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేసే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఈ విష‌యం తెలుసుకున్న విజ‌య్ అభిమానులు అదే జ‌రిగితే తెలుగు హీరో రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా త‌మిళ‌నాడులో రిలీజ్ కానివ్వ‌మంటూ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర్మాత దిల్ రాజును బెదిరిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ యాంటీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. హీరో విజ‌య్ ఫొటోని మార్షింగ్ చేసి నెట్టింట ట్రోల్ చేసిన నెటిజ‌న్ లు కొంత మంది మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ధ‌నుష్ న‌టించిన 'అసుర‌న్' మూవీలో ధ‌నుష్ ఊరి వాళ్ల కాళ్ల‌పై ప‌డుతున్న పొటోల‌ని విజ‌య్ గా మార్ఫింగ్ చేసి త‌మిళ‌నాడు సీఎమ్‌, ఆంధ్రా సీఎం, తెలంగాణ సీఎం, పాండిచ్చేరి సీఎం కాళ్ల‌పై విజ‌య్ ప‌డి త‌న సినిమా రిలీజ్ కి అంగీక‌రించండి అంటూ వేడుకుంటున్న‌ట్టుగా క్రియేట్ చేసి విజ‌య్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.