Begin typing your search above and press return to search.

'జాతిరత్నాలు' కోసం వస్తున్న 'రౌడీ రత్నం'

By:  Tupaki Desk   |   6 March 2021 7:37 AM GMT
జాతిరత్నాలు కోసం వస్తున్న రౌడీ రత్నం
X
నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ''జాతిరత్నాలు''. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ ‏గా నటించింది. స్వప్న సినిమాస్‌ బ్యానర్ పై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ వెరైటీగా ప్లాన్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయబడిన ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'జాతిరత్నాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దీనికి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ ఫన్నీ పోస్టర్ ని వదిలింది. రౌడీ రత్నం ముగ్గురు జాతిరత్నాలను తరుముతున్నట్లుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఏదేమైనా జాతిరత్నాలు టీమ్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియా - వెబ్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - బ్రహ్మానందంతో పాటుగా బ్రహ్మాజీ - మురళీ శర్మ - సీనియర్ నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చగా.. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు.