Begin typing your search above and press return to search.

సుక్కూ కోసం వేచి చూస్తాడా? లేదా మరో దర్శకుడిని చూసుకుంటాడా?

By:  Tupaki Desk   |   24 Dec 2021 12:30 AM GMT
సుక్కూ కోసం వేచి చూస్తాడా? లేదా మరో దర్శకుడిని చూసుకుంటాడా?
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై కేదార్‌ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గతేడాదే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న 'లైగర్'.. సుకుమార్ తెరకెక్కించే 'పుష్ప' సినిమా పూర్తైన వెంటనే వీరి కలయికలో మూవీ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే కరోనా పాండమిక్ వల్ల 'పుష్ప' రెండు భాగాలుగా మారడం.. 'లైగర్' షూటింగ్ డిలే అవడం జరిగింది. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు సుక్కూ 'పుష్ప' పార్ట్-1 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రారంభంలో సుకుమార్ - విజయ్ ల కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప 2' చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలని సుకుమార్ అండ్ బన్నీ టీమ్ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో చిత్రీకరణ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎంత శరవేగంగా షూటింగ్ జరిపినా ఇది వచ్చే ఏడాది చివరకు గానీ కంప్లీట్ అవదు.

ఇటు చూస్తే ఒక చిన్న షెడ్యూల్ మినహా 'లైగర్' షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు సుక్కూ ప్రాజెక్ట్ తప్ప మరో కొత్త చిత్రాన్ని వీడీ ప్రకటించలేదు. నెక్స్ట్ సుకుమార్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయితే మాత్రం.. ఇంకో ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ గ్యాప్ లో యువ హీరో మరో మూవీ చేయడానికి టైం దొరుకుతుంది.

పాన్ ఇండియా 'లైగర్' వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండకు నేషనల్ వైడ్ క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి దీనికి తగినట్లుగా తదితరులు సినిమా ప్లాన్ చేసుకోడానికి 'లైగర్' రిలీజ్ వరకు వేచి చూస్తాడా? లేదా సుకుమార్ కంటే ముందే మరో డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి సుకుమార్‌ - విజయ్‌ దేవరకొండ కాంబో లేట్ అవుతూ ఉండటంతో.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. అయితే వీటిని ఖండిస్తూ ఫాల్కన్‌ క్రియేషన్స్ టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది. దర్శక హీరోల కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని.. సుకుమార్-VD-ఫాల్కన్ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని.. 2022 లోనే సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.