Begin typing your search above and press return to search.

లేడి కమెడియన్ పంచ్ వైరల్ అయ్యిందే

By:  Tupaki Desk   |   25 May 2018 5:05 AM GMT
లేడి కమెడియన్ పంచ్ వైరల్ అయ్యిందే
X
సినిమా ఇండస్ట్రీలలో లేడి కమెడియన్స్ ఈ రోజుల్లో చాలా తక్కువనే చెప్పాలి. మన బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సీనియర్ నటీమణులు ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి నటి మణులు చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది తమిళ్ చబ్బీ గర్ల్ విద్యుల్లేఖ. సీనియర్ కోలీవుడ్ నటుడు మోహన్ రామన్ కూతురైన విద్యుల్లేఖ సౌత్ లో మంచి లేడి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. సరదాగా ఫొటోలు ట్వీట్లు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తుంది. రీసెంట్ గా ఒక పోస్ట్ చేసిన విద్యుల్లేఖ అందరి మొహాల్లో చిరునవ్వు తెప్పించడానికి ట్రై చేసింది. లండన్ లోని బకింగ్ హాం ప్యాలెస్ గురించి నెటిజన్స్ కు బాగా తెలిసే ఉంటుంది. అయితే అక్కడ అమ్మడు ఒక ఫోటో దిగి ఇంకో 22 ఏళ్లు వెయిట్ చేస్తే ఈ ప్యాలెస్ కు నేనే మహారాణి అంటూ పంచ్ వేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

బకింగ్ హాం ప్యాలెస్ పై అలా ఎందుకు పంచ్ వేసిందంటే.. మేఘన్ మార్కెల్ అనే మాజీ నటి 22 ఏళ్ల క్రితం బకింగ్ హాం ప్యాలెస్ ముందు ఒక టూరిస్ట్ గా వచ్చి ఫొటో దిగింది. అయితే ఆమె ఇప్పుడు బకింగ్ హాం ప్యాలెస్ కి ఓనర్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు ప్యాలెస్ ముందు ఓ ఫోటోకి పోజిచ్చి విద్యుల్లేఖ నిన్న మే 22 కాబట్టి సరిగ్గా మరో 22 ఏళ్ల తరువాత నేను కూడా మహారాణిగా మారుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని నవ్వించింది.