Begin typing your search above and press return to search.

'బ్ర‌హ్మానందం స్టాండప్ కామెడీ షో వర్కౌట్ కాలేదు'

By:  Tupaki Desk   |   18 Sep 2020 1:30 AM GMT
బ్ర‌హ్మానందం స్టాండప్ కామెడీ షో వర్కౌట్ కాలేదు
X
తమిళ నటుడు మోహన్ రామన్ కూతురు విద్యుల్లేఖ రామ‌న్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అటు కోలీవుడ్‌ తో పాటు ఇటు టాలీవుడ్‌ లో కూడా లేడీ కమెడియన్‌ గా విద్యుల్లేఖ తనదైన ముద్రను వేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమాలో తనదైన స్టైల్లో కామెడీని పండించి.. ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో బొద్దుగా ఉండే విద్యుల్లేఖ తెలుగు తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ లో స్లిమ్‌ గా మారి అందరిని షాక్ కి గురిచేసింది. ఈ క్రమంలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని త‌న‌కు కాబోయే భ‌ర్తని పరిచయం చేసి మరో షాక్ ఇచ్చింది. విద్యుల్లేఖ సన్నగా మారిన తర్వాత కూడా ఛాన్సెస్ ఒకప్పటిలా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ లో స్టాండ‌ప్ కామెడీ షో చేస్తోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా హాస్యబ్రహ్మ బ్ర‌హ్మానందం స్టాండ‌ప్ కామెడీ పెద్ద‌గా వర్కౌట్ కాలేదని కామెంట్స్ చేసింది.

కాగా, విద్యుల్లేఖ రామన్ - అబీష్ మాథ్యూలతో అమెజాన్ ప్రైమ్ 'కామిక్ స్థాన్ సెమ్మ కామెడీ పా' అనే స్టాండ‌ప్ కామెడీ షో ప్లాన్ చేసింది. అర్జున్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ షో తమిళ్ భాషలో ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి తాజాగా మీడియా ఇంట్రాక్ష‌న్ లో పాల్గొన్న ఈ లేడీ కమెడియన్ మాట్లాడుతూ.. 'బ్ర‌హ్మానందంతో చేసిన స్టాండప్ కామెడీకి స‌రైన ప్లానింగ్ లేద‌ని.. అందుకే పెద్దగా వర్కౌట్ కాలేదని.. ప్లానింగ్ ఉంటే స్టాండప్ కామెడీ బాగా వ‌ర్క్ అయ్యుండేదని తేల్చి చెప్పింది. దీంతో తెలుగు ఆడియన్స్ అమ్మడిపై కామెంట్స్ చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న సీనియర్ కమెడియన్ షో ని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.