Begin typing your search above and press return to search.

గుర్రం పై నిటారుగా నిలబడిన హీరో.. అసలు ఏమైంది..??

By:  Tupaki Desk   |   11 March 2021 2:34 PM GMT
గుర్రం పై నిటారుగా నిలబడిన హీరో.. అసలు ఏమైంది..??
X
బాలీవుడ్ పాపులర్ యాక్టర్ విక్కీ కౌషల్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా విక్కీ.. తను గుర్రం పై పడకుండా నిలబడిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అతను నిలబడిన పోజును వెల్కమ్ సినిమాలో అనిల్ కపూర్ వేసిన పెయింటింగ్ తో పోల్చాడు. ప్రస్తుతం ఆ పిక్ సినీ అభిమానులను, సోషల్ మీడియా యూసర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోను పోస్ట్ చేసిన విక్కీ.. 'ఈరోజు ఉదయం మజ్ను భాయ్ పెయింటింగ్ చూసి ప్రేరణ పొందాను' అంటూ నోట్ రాసాడు. అంటే వెల్కమ్ సినిమాలో అనిల్ కపూర్ క్యారెక్టర్ పేరు మజ్ను అని తెలుస్తుంది. విక్కీ గుర్రం పై నిలబడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తలకు హెల్మెట్ తో పాటు కాళ్లకు షూస్ కూడా ధరించాడు.

నిజానికి వెల్‌కమ్ సినిమాలో మజ్ను క్యారెక్టర్.. ఫన్ తో కూడిన పెయింటింగ్ కనిపిస్తుంది. అందులోను గుర్రంపై గాడిద నిలబడి ఉన్నట్లు ఉంటుంది. అలాగే పెయింటింగ్ పై సాగర్ అనే పేరు కూడా చూడవచ్చు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో విక్కీ పిక్ చూస్తూ తన కో-యాక్టర్స్, ఫ్యాన్స్ హ్యాపీ మూమెంట్స్ అంటూ అతని హార్డ్ వర్క్ కు ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ కూడా చేశారు. ఈ ఫోటోపై హీరో టైగర్ ష్రాఫ్ స్పందించి "క్రేజీ" అని.. సయాని గుప్తా "వోహ్హ్".. కియారా అద్వానీ "హా టాప్‌ప్" అని కామెంట్ చేయగా.. ఫిల్మ్ మేకర్ శశాంక్ ఖైతాన్ ఎమోజీలతో "వాహ్ వాహ్" అంటూ కామెంట్ చేసాడు. ఇలా చాలామంది సెలబ్రిటీలు విక్కీ పిక్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విక్కీ.. తదుపరి సినిమా 'ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ' కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఉరి ఫేమ్ ఆదిత్య ధర్ తెరకెక్కించనున్నాడు.