Begin typing your search above and press return to search.

ఇండియా రెండో పౌరుడిని కదిలించిన మహర్షి

By:  Tupaki Desk   |   15 May 2019 4:27 AM GMT
ఇండియా రెండో పౌరుడిని కదిలించిన మహర్షి
X
కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా మూల కథలో రైతుల గురించి మహర్షి సినిమాలో ఇచ్చిన సందేశం ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారినే మెప్పించింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమా వీక్షించిన ఆయన దీని గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ మహర్షిని ప్రభోదాత్మకత కలిగిన చిత్రంగా వర్ణించారు. ప్రతి ఒక్కరు చూడాలని రైతులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు కాబట్టి స్వయంగా రికమండ్ చేయడం విశేషం.

ఇది మహర్షి సాధించిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఓ రీజనల్ సినిమా గురించి స్పందించడం అరుదు. అలాంటిది భారతదేశపు రెండో పౌరుడు ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే మాటలా. ఇప్పుడీ ట్వీట్ మహేష్ బాబుతో పాటు ఫ్యాన్స్ కు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ దాటేసిన మహర్షి అంతే మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఫైనల్ రన్ పూర్తి అయ్యేలోపు చేరుకుంటే కనక ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లో ప్లేస్ ఖాయం అయిపోతుంది. ఇప్పుడు వెంకయ్య నాయుడు అంతటివారు చెప్పారు అంటే ఇంకా సినిమా చూడని ఫ్యామిలీ ఆడియన్స్ మహర్షి వైపు లుక్కేసేందుకు అవకాశాలు ఉన్నాయి. రేపటితో మొదటివారం పూర్తి చేసుకోనున్న మహర్షికి రాబోయే వీకెండ్ చాలా కీలకంగా మారనుంది