Begin typing your search above and press return to search.

'రంగ్‌ దే' ను పండుగకు కన్ఫర్మ్‌ చేసిన దర్శకుడు

By:  Tupaki Desk   |   23 Sep 2020 1:30 PM GMT
రంగ్‌ దే ను పండుగకు కన్ఫర్మ్‌ చేసిన దర్శకుడు
X
నితిన్‌.. కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న 'రంగ్‌ దే' సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. జీ5 వారు ఈ సినిమాకు భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేశారు అనేది కూడా మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కాని యూనిట్‌ సభ్యులు మాత్రం ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపడం లేదు అంటూ ఇటీవలే మేము ఒక కథనంను ప్రచురించడం జరిగింది. మేము అన్నట్లుగానే నితిన్‌ 'రంగ్‌ దే' సినిమాను ఓటీటీలో కాకుండా సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి అధికారికంగా ప్రకటించాడు.

కరోనా కారణంగా ఆరు నెలలుగా షూటింగ్‌ నిలిచి పోయింది. మళ్లీ ఇన్ని నెలలకు షూటింగ్ ను పునః ప్రారంభించారు. నేటి నుండి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను షూట్‌ చేస్తున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు. సంక్రాంతికి అందరం కలుద్దాం అంటూ వెంకీ చేసిన ట్వీట్‌ తో సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్‌ ఏడాది లోపే 'రంగ్‌ దే' సినిమాను విడుదల చేయబోతున్నాడు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే జులై 31వ తారీకున ఈ సినిమాను విడుదల చేసేవారు. కరోనా లాక్ డౌన్‌ తో మొత్తం ప్లానింగ్‌ తారు మారు అయ్యింది.

నితిన్‌ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. నితిన్‌ పెళ్లి సందర్బంగా విడుదలైన ఒక ఫన్నీ వీడియో సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసుకున్న నితిన్‌ ఆ తర్వాత పడ్డ ఇబ్బందులు ఏంటీ అనేది ఫన్నీగా దర్శకుడు చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు కూడా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.