Begin typing your search above and press return to search.

వెంకీకి ఈ రెండు బంగారంలాంటి అవకాశాలు

By:  Tupaki Desk   |   23 Jan 2019 3:43 PM GMT
వెంకీకి ఈ రెండు బంగారంలాంటి అవకాశాలు
X
'తొలి ప్రేమ' చిత్రంను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోరు. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ లోనే నిలిచి పోయిన ఆ చిత్రం టైటిల్‌ ను తన మొదటి సినిమాకు పెట్టి పెద్ద సాహసంను చేసిన దర్శకుడు వెంకీ అట్లూరి పెద్ద సక్సెస్‌ ను అందుకున్నాడు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తో వెంకీ తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ సినిమాగా అఖిల్‌ మూడవ సినిమా బాధ్యత దక్కింది. రెండు సినిమాలు కూడా నిరాశ పర్చడంతో అఖిల్‌ మూడవ సినిమాపై నాగార్జున చాలా కసరత్తు చేసి వెంకీ అట్లూరికి ఆ చిత్ర బాధ్యతలు అప్పగించాడు.

అఖిల్‌ మూడవ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్‌ అవ్వాల్సిందే అనే ఉద్దేశ్యంతో చాలా కథలు విన్న తర్వాత నాగార్జున ఈ కథకు ఓకే చెప్పాడు. వెంకీ అట్లూరి, అఖిల్‌ ల కాంబినేషన్‌ లో 'మిస్టర్‌ మజ్ను' చిత్రం తెరకెక్కింది. మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా అయ్యింది. మిస్టర్‌ మజ్ను విజయం ఖాయం అంటూ నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వెంకీ అట్లూరికి మైత్రి వారు అడ్వాన్స్‌ ఇచ్చేశారు.

విజయ్‌ దేవరకొండ డేట్లు మైత్రి వారి వద్ద ఉన్నాయి. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమాను చేయాలని మైత్రి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇటీవలే విజయ్‌ దేవరకొండకు సూట్‌ అయ్యే ఒక మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ కథను కూడా వెంకీ అట్లూరి రెడీ చేసి వినిపించాడట. ఆ కథకు ఫిదా అయిన దేవరకొండ ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాల తర్వాత చేద్దామని హామీ ఇచ్చాడట. మిస్టర్‌ మజ్ను మరియు విజయ్‌ దేవరకొండ చిత్రాలు రెండు కూడా వెంకీ అట్లూరికి బంగారం లాంటి ఆఫర్లు. ఈ రెండు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే టాలీవుడ్‌ లో వెంకీ అట్లూరి టాప్‌ దర్శకుల జాబితాలో చేరిపోవడం ఖాయం. మరి ఆ ఆఫర్స్‌ ను వెంకీ అట్లూరి ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.