Begin typing your search above and press return to search.

ఏంది వెంకీ.. ఏంటీ సంగతి?

By:  Tupaki Desk   |   4 Jan 2018 4:24 AM GMT
ఏంది వెంకీ.. ఏంటీ సంగతి?
X
టాలీవుడ్ కి నాలుగు పిల్లర్లుగా దశాబ్దాల పాటు నిలిచిన నలుగురు హీరోలు.. ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేశారు. వరుస సినిమాలే కాదు.. హిట్స్ తో అలరిస్తున్నారు. అయితే.. వీరిలో వెంకటేష్ మాత్రం తన సినిమాల ఎంపికలో ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాడు.

గురు సినిమా సక్సెస్ అయినా వెంకీ కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. తేజ దర్శకత్వంలో మూవీ చేస్తున్నా.. అది మార్చికి గాని స్టార్ట్ కాదట. మరోవైపు వరుసగా మల్టీస్టారర్స్ కు సైన్ చేసేస్తున్నాడట వెంకీ. ఇప్పుడు వెంకీ చేతిలో మూడు మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఉన్నాయని అంటున్నారు. వెంకటేష్- వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 చిత్రం తెరకెక్కనుంది. మరోవైపు.. నాగ చైతన్యతో కలిసి ఓ మల్టీ స్టారర్ కు సై అన్నాడట వెంకటేష్. ఇప్పుడు వెంకీ- నాని కాంబినేషన్ లో మరో మల్టీ స్టారర్ ఓకే అయిందని.. పెద్ద దర్శకుడే ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేయనున్నాడని.. త్వరలోనే ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.

అసలు టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కి అద్యుడు వెంకటేష్. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్ కు అన్నయ్యగాను.. గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి.. మసాలా మూవీలో రామ్ తోను కలిసి మల్టీస్టారర్స్ చేశాడు వెంకటేష్. అంటే ఇప్పటికే మూడు మల్టీస్టారర్ మూవీస్ చేసిన వెంకీ.. ఇప్పుడు మరో మూడు ఈ తరహా చిత్రాలనే లైన్ లో పెట్టాడన్న మాట. వరుసగా మల్టీస్టారర్స్ ను ఓకే చేయడం వెనక వెంకీ ఉద్దేశ్యమేంటో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు.