Begin typing your search above and press return to search.

మల్టి స్టారర్ లకు ప్రాణం పోస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Oct 2017 1:30 AM GMT
మల్టి స్టారర్ లకు ప్రాణం పోస్తున్నారు
X

మల్టి స్టారర్ సినిమాలు చేయాలంటే ఈ రోజుల్లో హీరోలకు చాలా డేర్ తో కూడుకున్న పనైపోయింది. ఏ మాత్రం స్టోరీలో తేడా వచ్చినా కోలుకోవడం చాలా కష్టమని వాటిని టచ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇప్పటివరకు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలల్లో స్టార్ హీరోస్ ఎదో ఒక భారీ యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ లో అయితే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

కానీ టాలీవుడ్ లో ఒక భారీ స్టార్స్ తో మల్టి స్టారర్ యాక్షన్ మూవీ వచ్చి ఏళ్లు గడిచాయి. అప్పట్లో సీనియర్ నటులు వారి స్థాయిలో భారీ మల్టి స్టారర్ సినిమాలను చేశారు. కానీ ప్రస్తుత స్టార్ హీరోలు మాత్రం ఒక భారీ సినిమాను చేయడానికి ఇష్టపడటం లేదు. ఓ విధంగా అలంటి స్క్రిప్టులు కూడా రావడం లేదనే చెప్పాలి. అయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వారి వారి స్థాయిలో పర్వాలేదు అనిపించేలా మల్టి స్టారర్ సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. వారు ఎవరో కాదు నాగార్జున - విక్టరీ వెంకటేష్. వీరిద్దరు దగ్గరి బంధువులే అని అందరికి తెలిసిన విషయమే. అయితే నాగార్జున ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. చాలాసార్లు గెస్ట్ రోల్ లు కూడా అయన చాలానే చేశారు. చిన్న సినిమాలను కూడా ప్రోత్సాహిస్తూ ఉంటారు. నాగార్జున ఇదివరకే మంచు విష్ణు సినిమా కృష్ణార్జున లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యువ హీరోతో సినిమాను చేయడానికి రెడీ గా ఉన్నాడు. త్వరలో అశ్విని దత్త్ ప్రొడక్షన్స్ లో నానితో ఓ సినిమాను చేయనున్నాడు.

ఇక విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన మల్టి స్టారర్ సినిమాలను ఎవరు చేయలేదనే చెప్పాలి. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మంచి కథలొస్తే వెంకటేష్ కుర్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక త్వరలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వలో విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు, ఈ మల్టి స్టారర్ సినిమాలపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి నాగార్జున - వెంకటేష్ మల్టి స్టారర్ సినిమాలకు ఎనర్జీని ఇస్తున్నారనే చెప్పాలి.