Begin typing your search above and press return to search.

రాజ‌స్తాన్ లో వీర‌మ‌ల్లు షూటింగ్ ప్లాన్

By:  Tupaki Desk   |   30 Nov 2021 9:31 AM GMT
రాజ‌స్తాన్ లో వీర‌మ‌ల్లు షూటింగ్ ప్లాన్
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్న మేక‌ర్స్ అన్ని ప‌నుల్ని వేగంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. సితార బృందానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అందిస్తున్నారు.

అయితే ఇది ప‌వ‌న్ న‌టించే ఇత‌ర సినిమాల షూటింగుల‌కు ఆటంకంగా మారింద‌ట‌. ఇప్ప‌టికే ప‌వ‌న్ న‌టిస్తున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రీక‌ర‌ణ పెండింగ్ లో ఉంది. క్రిష్ చాలా కాలంగా వేచి చూస్తున్నా ప‌వ‌న్ నుంచి కొత్త షెడ్యూల్ కి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఎట్ట‌కేల‌కు టైమ్ వ‌చ్చింద‌ని అనుకుంటే ఇప్పుడు భీమ్లా నాయ‌క్ డ‌బ్బింగ్ కోసం డిసెంబ‌ర్ నుంచి ప‌వ‌న్ స్టూడియోకి అంకిత‌మ‌వుతున్నారు. దీంతో డిసెంబ‌ర్ లో జ‌ర‌గాల్సిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రీక‌ర‌ణ జ‌న‌వ‌రికి వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది.

ఈ గ్యాప్ లోనే ద‌ర్శ‌కుడు క్రిష్ రాజ‌స్థాన్ వెళ్లి లొకేష‌న్ల వేట సాగిస్తున్నార‌ని తెలిసింది. ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గానే పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభిస్తారు. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తదుప‌రి ప‌వ‌న్ తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో ఏజెంట్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ప‌వ‌న్ సినిమాపై దృష్టి సారించ‌నున్నార‌ని తెలిసింది.

పవర్ స్టార్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా చెబుతున్న హరిహర వీరమల్లు వ‌చ్చే ఏడాదిలో విడుద‌ల‌వుతుంది. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌ గజదొంగగా నటిస్తున్నారు. విరోచిత పోరాట‌ల‌తో అత‌డి పాత్ర ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మొఘలాయిల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.