Begin typing your search above and press return to search.

వీర సింహా రెడ్డి డైలాగ్.. కర్నూలు దద్దరిల్లింది..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 3:35 AM GMT
వీర సింహా రెడ్డి డైలాగ్.. కర్నూలు దద్దరిల్లింది..!
X
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమాకు వీరసింహా రెడ్డి టైటిల్ ఫిక్స్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నందమూరి అభిమానుల సమక్షంలో ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా వీర సింహా రెడ్డి డైరక్టర్ గోపీచంద్ మలినేని హుశారైన స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ కి ఉత్సాహపరచింది.

బాలయ్య అభిమానులు ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటారో అలా వీర సింహా రెడ్డి సినిమా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. సమర సింహా రెడ్డి సినిమా టైం లో ఆయన కోసం ఒకరోజు మొత్తం జైల్ లో ఉన్నాను. ఆ సినిమా నందమూరి అభిమానులకు ఎంత కిక్ ఇచ్చిందో ఆ మెమొరీస్ అన్నిటినీ మళ్లీ వీర సింహా రెడ్డిలో చూసుకుంటారని అన్నారు గోపీచంద్ మలినేని.

అభిమానుల కోసం సినిమాలోని ఒక డైలాగ్ కూడా చెప్పారు గోపీచంద్. వీర సింహా రెడ్డి పుట్టింది పులిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్ అనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపారు దర్శకుడు గోపీచంద్. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేస్తున్న ప్రాజెక్ట్ గా వీర సింహా రెడ్డిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరోపక్క క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ కూడా హిట్ ఫాం లో ఉన్నాడు. మరి ఈ సూపర్ హిట్ కాంబో కలిసి చేస్తున్న వీర సింహా రెడ్డి ఖచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు.

బాలయ్య సినిమా టైటిల్స్ కి సింహా సెంటిమెంట్ కలిసి వచ్చింది. సమర సింహా రెడ్డి నుంచి రాబోతున్న వీర సింహా రెడ్డి వరకు ఆయన టైటిల్ లో సింహం ఉంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఇన్నాళ్లు యువ హీరోలతో సినిమాలు చేసిన గోపీచంద్ గాడ్ ఆఫ్ మాస్ అయిన బాలకృష్ణతో సినిమా ఎలాంటి సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ తర్వాత వచ్చిన టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచగా టైటిల్ పోస్టర్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. డైరక్టర్ గోపీచంద్ మలినేని చెప్పిన ఆ మాస్ డైలాగ్ బాలయ్య నోటి వెంట వస్తే థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.