Begin typing your search above and press return to search.

కృష్ణాష్టమి.. ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం

By:  Tupaki Desk   |   24 Feb 2016 7:30 AM GMT
కృష్ణాష్టమి.. ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం
X
అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను బావ కళ్లలో సంతోషం కోసం మర్డర్ చేశానని చెప్పడం పెద్ద సంచలనం అయింది. ఆ డైలాగుని సినిమాల్లో కూడా చాలామంది వాడుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ వాసువర్మ అలాంటి మాటే అంటున్నాడు. ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం చూడటం కోసమే ‘కృష్ణాష్టమి’ లాంటి సినిమా తీశామని అతనంటున్నాడు. ఇప్పుడు నిజంగానే ప్రేక్షకుల ముఖాల్లో ఆ సంతోషం కనిపిస్తోందని చెప్పాడు వాసు వర్మ.

‘‘పక్కవాడి ముఖంలో సంతోషం చూడ్డం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఐతే ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం మేం పడ్డ కష్టం వృథా కాలేదు. వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మామూలుగా సినిమా విడుదలైన మూడు రోజుల వరకు కలెక్షన్స్ బాగానే ఉంటాయి. సోమవారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనుకున్నాను. దిల్ రాజుగారి ఆఫీస్ కు వెళ్లాను. ఐతే కలెక్షన్లు బాగున్నాయని శిరీష్ గారు చెప్పారు. చాలా హ్యపీగా అనిపించింది. ఐదు రోజులవుతున్నా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయంటే సినిమా ఎలా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. మాస్ - క్లాస్ అనే తేడా లేకుండా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఒక హిట్ అయినా ఇవ్వాలని దిల్ రాజుగారు పెట్టుకున్న టార్గెట్ ఈ సినిమాతో పూర్తయిందని అనుకుంటున్నాను’’ వాసు వర్మ అన్నాడు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘కృష్ణాష్టమి విడుదలై ఐదు రోజులవుతోంది. విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మల్టీప్లెక్సుల్లోనే కాకుండా బి, సి సెంటర్లలోనూ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాను తన భుజాలపై మోసి సక్సెస్ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు’’ అన్నాడు.