Begin typing your search above and press return to search.

తన స్టార్లకు కథ వినిపిస్తున్న కమ్ముల

By:  Tupaki Desk   |   8 July 2016 10:33 AM GMT
తన స్టార్లకు కథ వినిపిస్తున్న కమ్ముల
X
మొత్తానికి శ్రీను వైట్ల డైరక్షన్‌ లో ''మిష్టర్‌'' సినిమాను చేస్తాడో లేదో తెలియదు కాని.. చాలా అర్జెంటుగా శేఖర్‌ కమ్ముల డైరక్షన్‌ లో సినిమాను మాత్రం మొదలెట్టేశాలా ఉన్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. స్పెయిన్ వెళ్ళి మిష్టర్‌ షూటింగులో పాల్గొంటాడు అనుకుంటే.. మనోడు ఇప్పుడు దిల్‌ రాజు ఆఫీసులో కూర్చొని డైరక్టర్ గారు చెప్పే కథను వింటున్నాడు.

ఇప్పటికే సినిమా కథనూ.. టోటల్ డైలాగ్‌ వర్షన్ ను పూర్తి చేసిన శేఖర్‌ కమ్ముల.. ఇక తన హీరోహీరోయిన్లకు ఓసారి మొత్తంగా సినిమాను వినిపించేద్దాం అని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పుడు దిల్‌ రాజు ఆఫీసులో కూర్చొని.. మన మెగా హీరోకు.. అలాగే ప్రేమమ్‌ ఫేం సాయి పల్లవికీ స్ర్కిప్టును వినిపిస్తున్నాడు. ఒక ప్రక్కన ఈ సెషన్‌ జరుగుతుంటే.. మరో ప్రక్కన ఈ సినిమా కోసం ఆడిషన్లు కూడా నిర్వహిస్తున్నారు. సినిమాలో వరుణ్‌ తేజ్ కు ఒక అన్నయ్య.. సాయి పల్లవికి ఒక అక్క కూడా ఉంటారట. ఆ పాత్రలకు కొత్తవారిని ఆడిషన్‌ చేసి తీసుకుంటారని తెలుస్తోంది.

మొత్తానికి ఆగస్టులో దిల్ రాజు ఈ సినిమాను ప్రొడక్షన్‌ పట్టాలెక్కించేస్తారంటే ఏమో అనుకున్నాం కాని.. నిజంగానే తీసుకెళ్ళిపోతున్నారనమాట. అంటే.. మిష్టర్‌ సినిమా అటకెక్కినట్లేనా??