Begin typing your search above and press return to search.

అమితాబ్ తరువాత ఆ హీరోనే

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:59 PM IST
అమితాబ్ తరువాత ఆ హీరోనే
X
బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా లేటెస్ట్ గా వస్తోన్న యువ హీరోలు ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎవరు చేయని స్టైల్ లో సినిమాలను చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం యువతను బాగా ఆకట్టుకుంటోన్న యువ హీరోల్లో వరుణ్ ధావన్ టాప్ లో ఉన్నాడని చెప్పాలి. గత కొంత కాలంగా వరుణ్ చేస్తోన్న సినిమాలు చాలా వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి.

వరుణ్ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. నటుడిగానే కాకుండా అభిమానులకు దగ్గరగా ఉండే స్టార్ అని అందరిచేత అనిపించుకున్నాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా మడమే టస్సాడ్స్ హాంగ్ కాంగ్ లో వరుణ్ ధావన్ మైనపు బొమ్మని ప్రదర్శించారు. ఇండియా నుంచి అమితాబ్ బచ్చన్ - మహాత్మా గాంధీల స్టాచులను మాత్రమే అక్కడ ప్రదర్శించారు.

అంతటి మహానుబావుల తరువాత కేవలం వరుణ్ ధావన్ స్టైలిష్ స్టాచును అక్కడ సెట్ చేశారు. హంప్టీ శర్మకి దళ్హనియాలోని తన పాత్ర పోజు లో ఉన్న ఆ బొమ్మ ని చూడటానికి వరుణ్ ధావన్ తన పేరెంట్స్ తో వెళ్లాడు. ఒకప్పుడు మహత్మ గాంధీ బొమ్మ దగ్గర ఫొటో దిగాను. ఇప్పుడు నా స్టాచుతో ఫొటో దిగుతున్నందుకు సంతోషంగా ఉందని వరుణ్ తెలిపాడు. అందుకు సంబందించిన పోటోలను కూడా జూడ్వా 2 హీరో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.