Begin typing your search above and press return to search.

షూటింగ్ రీస్టార్ట్ చేసిన 'వరుడు కావలెను'..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 6:30 AM GMT
షూటింగ్ రీస్టార్ట్ చేసిన వరుడు కావలెను..!
X
సినీ ఇండస్ట్రీలో మొన్నటివరకు కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే సెకండ్ లాక్డౌన్ ముగిసి సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ లభించడంతో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ సందడి మొదలైంది. అందులో భాగంగానే తాజాగా యువహీరో నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా వరుడు కావలెను షూటింగ్ కూడా రీస్టార్ట్ చేసినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వరుడు కావలెను సినిమా షూటింగ్ ప్రారంభం చేస్తున్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా నాగశౌర్య ఈ ఏడాది వరుసపెట్టి సినిమాలతో బిజీ అయిపోయాడు. ఆ మధ్యలో వరుస ప్లాప్స్ పడటంతో స్లో అయిన శౌర్య లాక్డౌన్ సమయంలో దాదాపు అరడజను సినిమాలు లైనప్ చేసేసాడు. ప్రస్తుతం శౌర్య ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్స్ జరుపుతున్నాడు. అందులో మొదటగా తన 20వ సినిమా 'లక్ష్య'ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే పోలీస్ వారి హెచ్చరికతో పాటు లేడీ డైరెక్టర్ లక్ష్మిసౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను చేస్తున్నాడు. ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో శౌర్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.

రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న వరుడు కావలెను మూవీలో శౌర్య సరసన రితూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీటితో పాటు ఈ యువహీరో రొమాంటిక్ మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.. మరో యాక్షన్ డ్రామా సినిమా కూడా చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో హీరోయిన్లకు డైరెక్టర్ లక్ష్మీసౌజన్య సీన్ వివరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లక్ష్య తర్వాత రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో!