Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న వర్మ కరోనా ఫిలాసఫీ..!

By:  Tupaki Desk   |   30 April 2021 7:30 AM GMT
వైరల్ అవుతున్న వర్మ కరోనా ఫిలాసఫీ..!
X
సినీ ఇండస్ట్రీలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ పంథా వేరనే సంగతి అందరికి తెలిసిందే. అందరూ ఒకలా ఆలోచిస్తే ఆయన మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఆలోచించి సోషల్ మీడియాలో ఆయనకు తోచిన కొటేషన్స్ లేదా ఒపీనియన్స్ కాంట్రవర్సీ అయ్యేలా పోస్ట్ చేస్తుంటారు. అంటే వర్మ మాములుగానే పోస్ట్ చేస్తాడు కానీ ఆ పోస్టులు వాతాంతటవే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాయి. నిజానికి ఎవరి ఆలోచనలు వారివే కానీ మరీ ఇంత డిఫరెంట్ గా ఆలోచించే వ్యక్తులు తక్కువగా కనిపిస్తుంటారు. అయితే సినిమాలపరంగానే కాకుండా వర్మ సోషల్ మీడియాలో ఎంతటి రచ్చలేపగలడో విదితమే. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఆయన కూడా పోస్టులు పెడుతుంటాడు. తాజాగా వర్మ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

అంటే అది ఆయన మేటర్ అవునా కాదా అనేది పక్కన పెడితే.. ఆ ఫోటోలో ఉన్నటువంటి మేటర్ మాత్రం ఖచ్చితంగా ఆలోచనలు కలిగించేదే. ఎందుకంటే ప్రస్తుతం దేశం మొత్తం కరోనా కారణంగా రోజురోజుకి దారుణంగా మారుతోంది. ఎక్కడపడితే అక్కడే జనాలు ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వివాదాల వర్మ.. అటు కాంట్రవర్సీ అయ్యేలా ఇటు నిజమే అనిపించేలా పోస్ట్ చేసాడు. ఇంతకీ ఆ మేటర్ ఏంటంటే.. "2019లో నెగటివ్ మనుషులను దూరం పెట్టాము.. 2020లో పాజిటివ్ మనుషులను దూరం పెట్టాము. ప్రస్తుతం 2021లో అసలు మనుషులనే దూరం పెడదాం" అనే విధంగా పోస్ట్ పెట్టాడు వర్మ. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అవును నిజమే కదా.. అంటూ ఆర్జీవి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.